NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajnath Singh: సంప్రదాయ యుద్ధాలు చేసుకునే కాలం పోయింది.. ఏఐ రాకతో సాంకేతిక యుద్ధం జరుగుతోంది: రాజ్‌నాథ్‌ సింగ్ 
    తదుపరి వార్తా కథనం
    Rajnath Singh: సంప్రదాయ యుద్ధాలు చేసుకునే కాలం పోయింది.. ఏఐ రాకతో సాంకేతిక యుద్ధం జరుగుతోంది: రాజ్‌నాథ్‌ సింగ్ 
    ఏఐ రాకతో సాంకేతిక యుద్ధం జరుగుతోంది: రాజ్‌నాథ్‌ సింగ్

    Rajnath Singh: సంప్రదాయ యుద్ధాలు చేసుకునే కాలం పోయింది.. ఏఐ రాకతో సాంకేతిక యుద్ధం జరుగుతోంది: రాజ్‌నాథ్‌ సింగ్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 10, 2025
    02:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజకీయ,సైనిక లక్ష్యాలను సాధించేందుకు కొందరు వ్యక్తులు సైబర్ దాడులను ఒక ఆయుధంలా ఉపయోగిస్తున్నారని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

    తప్పు సమాచారాన్ని వ్యాప్తి చేయడం కూడా ఈ విధానంలో భాగమని ఆయన అభిప్రాయపడ్డారు.

    తమిళనాడులోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

    ప్రస్తుత కాలంలో జరుగుతున్న యుద్ధాలు,ఘర్షణలు సంప్రదాయ యుద్ధాల మాదిరిగా లేవని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు.

    "రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత,మానవ జోక్యం లేకుండానే పనిచేసే వ్యవస్థలను రూపొందిస్తోంది.ఇప్పుడు చాలా విషయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాం. భూమి,సముద్రం,గగన మార్గాల్లో జరిగే సంప్రదాయ యుద్ధాల కాలం ఇప్పుడు దాటిపోయింది. సాంకేతిక ఆధారిత యుద్ధాల యుగంలోకి ప్రవేశించాం," అని అన్నారు.

    వివరాలు 

    సంప్రదాయ యుద్ధాల కన్నా ఏ మాత్రం తక్కువ కాదు

    మనం ఇప్పుడు 'గ్రే జోన్' లేదా హైబ్రిడ్ యుద్ధ శకంలో ఉన్నాం.ఇందులో రాజకీయ, సైనిక లక్ష్యాలను సాధించడానికి సైబర్ దాడులు ప్రధాన ఆయుధాలుగా మారాయి."ఒక తూటా పేల్చకుండానే ఆర్థిక యుద్ధం ద్వారా గమ్యాలను చేరుకోవచ్చు.అందుకే ఇవి సాధనాలుగా మారుతున్నాయి. సైబర్, స్పేస్ (అంతరిక్షం),సమాచారం ఆధారిత యుద్ధాలు సంప్రదాయ యుద్ధాల కన్నా ఏ మాత్రం తక్కువకాదు. వీటిని ఎదుర్కొనాలంటే మన సాయుధ దళాలన్నీ కలిసికట్టుగా, బహుళ-డొమైన్ వాతావరణంలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది," అని పేర్కొన్నారు.

    "మన సరిహద్దుల్లోని ప్రాంతాల నుంచి మన దేశంపై పరోక్ష యుద్ధం కొనసాగుతోంది.అక్కడి నుంచి ఉగ్రవాదం రూపంలో ముప్పు పెరుగుతోంది.ఈపరిస్థితుల్లో సైబర్ దాడులకు మనం బలికాకుండా ఉండాలంటే,మనమంతా ఏకతాటిపై చేరి సమర్థంగా పోరాడాలి,"అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్‌నాథ్ సింగ్

    తాజా

    Heavy rains: తెలంగాణలో రెయిన్ అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం భారీ వర్షాలు
    Rana Naidu Season 2: 'రానా నాయుడు' సీజన్‌2 ట్రైలర్ వచ్చేసింది! రానా దగ్గుబాటి
    Op Sindoor: మరో 8 ప్రాంతాలపై భారత్ దాడులు.. బయటపెట్టిన పాక్ ప్రభుత్వ పత్రాలు! ఆపరేషన్‌ సిందూర్‌
    COVID-19: పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి  పశ్చిమ బెంగాల్

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం చైనా
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  రక్షణ శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025