NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajnath Singh: 'ప్రపంచం ఆశ్చర్యపోయేలా ప్రతీకారం ఉంటుంది'.. పహల్గామ్ దాడులపై రాజ్‌నాథ్ సింగ్ బిగ్ వార్నింగ్..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Rajnath Singh: 'ప్రపంచం ఆశ్చర్యపోయేలా ప్రతీకారం ఉంటుంది'.. పహల్గామ్ దాడులపై రాజ్‌నాథ్ సింగ్ బిగ్ వార్నింగ్..
    'ప్రపంచం ఆశ్చర్యపోయేలా ప్రతీకారం ఉంటుంది'.. పహల్గామ్ దాడులపై రాజ్‌నాథ్ సింగ్ బిగ్ వార్నింగ్..

    Rajnath Singh: 'ప్రపంచం ఆశ్చర్యపోయేలా ప్రతీకారం ఉంటుంది'.. పహల్గామ్ దాడులపై రాజ్‌నాథ్ సింగ్ బిగ్ వార్నింగ్..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 23, 2025
    05:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గామ్ ఉగ్రదాడిపై దేశమంతా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.

    దేశవ్యాప్తంగా ప్రజలు పాకిస్థాన్‌తో పాటు ఉగ్రవాద శిబిరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

    ఇజ్రాయెల్‌ హమాస్‌పై చేపట్టిన దాడులను ఉదాహరణగా చూపిస్తూ, భారత్‌ కూడా అదే రీతిలో ప్రతిస్పందించాలని కోరుతున్నారు.

    మంగళవారం రోజున కాశ్మీర్ ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లిన పర్యాటకులపై లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆకస్మికంగా దాడి చేశారు.

    ఈ భయానక ఘటనలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన తీవ్రత దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రివర్గం అత్యున్నత స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది.

    వివరాలు 

    పాకిస్తాన్‌ను ఉద్దేశించి గట్టి హెచ్చరికలు

    ఈ నేపథ్యంలో,రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి గట్టి హెచ్చరికలు చేశారు.

    పహల్గామ్ ఘటనకు బాధ్యులైన ఉగ్రవాదులను,వారిని ప్రోత్సహించిన వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమని ఆయన స్పష్టం చేశారు.

    ఈ కుట్ర వెనుక ఉన్న వారిని గుర్తించి, తగిన విధంగా ప్రతీకారం తీసుకోవడం ఖాయం అని తెలిపారు.

    "ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని భారతదేశం త్వరలోనే గట్టిగా ఎదిరిస్తుంది" అని ఆయన అన్నారు.

    వివరాలు 

    ఎవ్వరూ తప్పించుకోలేరు: రాజ్‌నాథ్

    ''భారత్‌పై దాడి చేసినవాళ్లను మాత్రమే కాదు, దాడికి వెనుక తోడ్పాటిచ్చినవాళ్లను కూడా ట్రాక్ చేసి కఠినంగా శిక్షిస్తాము.

    ఉగ్రవాదులు, వారిని ఆదేశిస్తున్న యజమానులు.. ఎవ్వరూ తప్పించుకోలేరు'' అని రాజ్‌నాథ్ హెచ్చరించారు.

    భారత్ ఇప్పుడు బలంగా ఉంది, ఉగ్రవాద బెదిరింపులకు తలొగ్గే దేశం కాదు.

    ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచే రీతిలో సవరణాత్మక జవాబు ఇస్తామని చెప్పారు. భారత్‌ను ఎవ్వరూ బలహీనపరచలేరని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్‌నాథ్ సింగ్

    తాజా

    Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..! జమ్ముకశ్మీర్
    Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి! పర్యాటకం
    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం చైనా
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025