NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Rajnath Singh: భారత రక్షణ సామర్థ్యంలో కొత్త అధ్యాయం.. లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి యూనిట్ ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    Rajnath Singh: భారత రక్షణ సామర్థ్యంలో కొత్త అధ్యాయం.. లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి యూనిట్ ప్రారంభం

    Rajnath Singh: భారత రక్షణ సామర్థ్యంలో కొత్త అధ్యాయం.. లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి యూనిట్ ప్రారంభం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 11, 2025
    01:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రక్షణ రంగంలో కీలక అడుగుగా ఇవాళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.

    ఈ కేంద్రాన్ని 'ఉత్తరప్రదేశ్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌'' పరిధిలో నిర్మించారు.

    కేంద్రాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ వర్చువల్‌ మాధ్యమంలో ప్రారంభించనున్నారు.

    ఈ బ్రహ్మోస్‌ తయారీ యూనిట్‌ను ఏడాదికి 80 నుండి 100 క్షిపణులు ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగినలా డిజైన్‌ చేశారు.

    రూ. 300 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ కేంద్రం, భారత్‌-రష్యా సంయుక్త ఉపక్రమంగా బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌ క్షిపణుల తయారీలో కీలక పాత్ర పోషించనుంది.

    Details

    400 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం

    బ్రహ్మోస్‌ క్షిపణి 290 నుండి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు.

    ఇది 'ఫైర్ అండ్ ఫర్గెట్‌' గైడెన్స్‌ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. భూమి, సముద్రం, గగనతలాల నుంచి ప్రయోగించవచ్చేలా డిజైన్‌ చేశారు.

    కొత్తగా ప్రారంభమయ్యే ఈ కేంద్రంలో ఏడాదిలోగా 100 నుండి 150 కొత్త తరం బ్రహ్మోస్‌ క్షిపణుల తయారీ జరగనుంది.

    ఈ న్యూ జెనరేషన్‌ బ్రహ్మోస్‌ క్షిపణుల పరిధి 300 కిలోమీటర్లు కాగా, వాటి బరువు గణనీయంగా తగ్గించారు.

    ప్రస్తుతం ఉన్న బ్రహ్మోస్‌ బరువు 2900 కిలోలు అయితే, కొత్త తరం క్షిపణుల బరువు కేవలం 1290 కిలోలకే పరిమితమైంది.

    ఈ అభివృద్ధి దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలకంగా నిలవనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజ్‌నాథ్ సింగ్
    లక్నో

    తాజా

    Rajnath Singh: భారత రక్షణ సామర్థ్యంలో కొత్త అధ్యాయం.. లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి యూనిట్ ప్రారంభం రాజ్‌నాథ్ సింగ్
    IPL 2025: విదేశీ ఆటగాళ్లు తిరిగొస్తారు.. ఐపీఎల్ కొనసాగుతుంది : బీసీసీఐ ఛైర్మన్ బీసీసీఐ
    Sumanth: మృణాల్‌ ఠాకూర్‌ పెళ్లి వార్తల్లో నిజం లేదు.. స్పష్టం చేసిన సుమంత్  మృణాల్ ఠాకూర్
    PM Modi: సరిహద్దు ఉద్రిక్తతలపై ప్రధాని నివాసంలో హై లెవల్ భద్రతా సమీక్ష నరేంద్ర మోదీ

    రాజ్‌నాథ్ సింగ్

    అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్‌నాథ్ పర్యటన.. సరిహద్దులో వ్యూహాత్మక ప్రాజెక్టుల ప్రారంభం చైనా
    ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఆసియాలోనే అతిపెద్ద 'ఏరో ఇండియా షో'- నేడు బెంగళూరులో ప్రారంభించనున్న ప్రధాని మోదీ బెంగళూరు
    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కరోనా పాజిటివ్  రక్షణ శాఖ మంత్రి

    లక్నో

    'త్వరలోనే లక్నో పేరు 'లక్ష్మణ్ నగరి'గా మార్పు', యూపీ డిప్యూటీ సీఎం ప్రకటన శ్రీరాముడు
    లక్నో కోర్టులో తూపాకీ కాల్పులు; గ్యాంగ్‌స్టర్ హత్య  భారతదేశం
    లక్నో: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, సుత్తితో కొట్టి చంపిన యువకుడు  ఉత్తర్‌ప్రదేశ్
    లక్నోలోని బీజేపీ ఎమ్మెల్యే నివాసంలో 24 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య   ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025