చంద్రుడిపై భారతదేశపు సంతకం: నింగిలోకి ఎగసిన చంద్రయాన్-3 మిషన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అరుదైన ఘనతను అందుకుంది. చంద్రుడి పైకి పంపిస్తున్న చంద్రయాన్-3 మిషన్ ని ఈరోజు మధ్యాహ్నం 2:35గంటలకు LVM3 M4రాకెట్ సాయంతో నింగిలోకి విజయంవంతంగా పంపింది. ఈ మిషన్ ప్రయాణం ఆరు వారాలు కొనసాగుతుంది. ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడి దక్షిణ ధృవం మీద చంద్రయాన్-3 మిషన్ ల్యాండ్ అవుతుంది. చంద్రుడి దక్షిణ ధృవం మీదకు మిషన్ ని పంపడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి. గత కొనేళ్ళుగా చంద్రుడి ధృవాన్ని అన్వేషించాలని సైంటిస్టులు ఉవ్విళ్ళూరుతున్నారు. దక్షిణ ధృవం మీద దిగిన తర్వాత, ఈ మిషన్ లోని రోవర్.. 14రోజుల పాటు అక్కడ పరిశోధనలు చేస్తుంది.