NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / KumbhMela 2025: అంతరిక్షం నుంచి తీసిన మహా కుంభమేళా చిత్రాలను షేర్ చేసిన ఇస్రో 
    తదుపరి వార్తా కథనం
    KumbhMela 2025: అంతరిక్షం నుంచి తీసిన మహా కుంభమేళా చిత్రాలను షేర్ చేసిన ఇస్రో 
    అంతరిక్షం నుంచి తీసిన మహా కుంభమేళా చిత్రాలను షేర్ చేసిన ఇస్రో

    KumbhMela 2025: అంతరిక్షం నుంచి తీసిన మహా కుంభమేళా చిత్రాలను షేర్ చేసిన ఇస్రో 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 22, 2025
    01:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభమేళా (Kumbh Mela 2025)తో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సందడిగా మారింది.

    జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు జరుగనున్న ఈ మహా కార్యక్రమంలో 40 కోట్లకుపైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించనున్నారని అంచనా.

    ఈ కుంభమేళాకి సంబంధించి ఇస్రో విడుదల చేసిన స్పేస్‌ వ్యూ చిత్రాలు విశేష దృష్టిని ఆకర్షించాయి.

    మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేకరించిన చిత్రాలు స్పష్టం చేశాయి.

    తాత్కాలిక టెంట్ హౌస్‌లు, తేలియాడే వంతెనల ఏర్పాట్ల కారణంగా గత కొన్ని నెలలకూ ఇప్పటి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది.

    ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసిన శివాలయ పార్క్‌ కూడా ఈ చిత్రాల్లో కనిపించింది.

    వివరాలు 

    వేడుకల ద్వారా 12లక్షల మందికి తాత్కాలిక ఉపాధి

    2024 ఏప్రిల్ 6వ తేదీకి తీసిన చిత్రంలో ఆ ప్రాంతం ఖాళీగా ఉండగా,2024 డిసెంబర్ 22,2025 జనవరి 10కి తీసిన చిత్రాల్లో విభిన్న మౌలిక సదుపాయాలు,శివాలయ పార్క్‌ కూడా కనిపించాయి.

    భారతదేశం మ్యాప్‌ ఆకారంలో అది రూపుదిద్దుకుంది.ఇదే సమయంలో,45 రోజుల పాటు కొనసాగనున్నఈ మేళా ద్వారా రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు రూ.2లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు.

    ఈ వేడుకల ద్వారా 12లక్షల మందికి తాత్కాలిక ఉపాధి కల్పించబడుతుందని కూడా వారు తెలిపారు.

    మొత్తం 10,000 ఎకరాల విస్తీర్ణంలో కుంభమేళా కోసం ఏర్పాట్లు నిర్వహించామని, ఏ సమయంలోనైనా 50 లక్షల నుంచి 1 కోటి మందికి పవిత్ర స్నానాలు చేయడానికి అవసరమైన సౌకర్యాలు కల్పించామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఇస్రో చేసిన ట్వీట్ 

    ISRO Captures Maha Kumbh Mela from the Skies: A Space View of the World's Largest Pilgrimage Gathering - https://t.co/GPMzxN5B8x pic.twitter.com/srLJkCpYWQ

    — Hams Live News (@hamslivenews) January 22, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇస్రో

    తాజా

    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ
    IPL 2025: మాకు అన్యాయం జరిగింది... ఐపీఎల్ అధికారులపై మండిపడ్డ కోల్‌కతా ఐపీఎల్
    Bengaluru: బెంగళూరులో దారుణం.. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం లభ్యం.. బెంగళూరు

    ఇస్రో

    Shubhanshu Shukla: అంతరిక్ష కేంద్రంలోకి నాసా భారత గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతరిక్షం
    ISRO: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర ప్రయాణంలో 5 ప్రయోగాలు చేయనున్న ఇస్రో వ్యోమగాములు  సోమనాథ్
    ISRO: ఇస్రో కొత్తగా ప్రయోగించిన ఉపగ్రహం EOS-08 ఏం చేస్తుంది? టెక్నాలజీ
    ISRO: ఇస్రో 2019-2023 మధ్య 64 అమెరికా ఉపగ్రహాలను ప్రయోగించింది టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025