NASA: చంద్రుడి దక్షిణ ధ్రువంపై భూమికి చెందిన సూక్ష్మజీవులు బతికే అవకాశం.. నాసా కీలక అధ్యయనం
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రుడు చూడటానికి నిర్జీవమైన, అత్యంత ప్రతికూల వాతావరణం ఉన్న ప్రాంతంలా కనిపిస్తాడు. అయితే భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన కొన్ని సూక్ష్మజీవులు చంద్రుడిపైనా మనుగడ సాగించే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా చంద్రుడి దక్షిణ ధ్రువంలోని ఎప్పుడూ నీడలో ఉండే ప్రాంతాల్లో మానవుల వెంట అంతరిక్షంలోకి వెళ్లిన కొన్ని సూక్ష్మజీవులు సజీవంగా ఉండే అవకాశం ఉందని నాసా తెలిపింది. ఈ పరిశోధన ఆగస్టు 19, 2026న 'సైన్స్ అడ్వాన్సెస్' జర్నల్లో ప్రచురితమైంది. చంద్రుడిపై ఉన్న అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో సూక్ష్మజీవులు ఎలా మనుగడ సాగించగలవో మరింత లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది.
వివరాలు
చంద్రుడిపై శాశ్వత మానవ నివాసం ఏర్పాటుకు ప్రయత్నాలు..
భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత మానవ నివాసం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో.. చంద్రుడి పురాతన రసాయన ఆనవాళ్లు, వ్యోమగాముల ద్వారా అక్కడికి చేరిన సూక్ష్మజీవుల కాలుష్యం మధ్య తేడాను గుర్తించడం శాస్త్రవేత్తలకు సవాలుగా మారొచ్చని పేర్కొంది.
ఇదే సమస్య భవిష్యత్తులో అంగారకుడి విషయంలోనూ ఎదురయ్యే అవకాశం ఉంది.
మేరీల్యాండ్లోని గ్రీన్బెల్ట్లో ఉన్న నాసా గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రబల్ సక్సేనా కీలక వ్యాఖ్యలు చేశారు.
మనుషులు సహజంగానే అన్వేషకులని.. వారు ఎక్కడికి వెళ్లినా తమ గొంతులు, జ్ఞాపకాలు, సూక్ష్మజీవులను కూడా వెంట తీసుకెళ్తారని ఆయన తెలిపారు.
వివరాలు
అంతరిక్ష నివాస ప్రాంతాల నుంచి బయటకు తప్పించుకునే అవకాశం..
కొంతమంది శాస్త్రవేత్తలకు ఇది ఆందోళన కలిగించే అంశం కావచ్చని, అయితే దీనిని ఒక ఉపయోగకరమైన శాస్త్రీయ ప్రయోగానికి అవకాశంగా కూడా చూడొచ్చని సక్సేనా పేర్కొన్నారు.
మనుషులు అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు సూక్ష్మజీవులు కూడా వారితో పాటు అక్కడికి చేరడం దాదాపు ఖాయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పెన్సిల్ రబ్బరు పరిమాణంలో ఉండే చర్మం భాగంలోనే సగటున దాదాపు 10 లక్షల బ్యాక్టీరియా ఉంటాయి.
ఇవి స్పేస్సూట్లు, అంతరిక్ష నివాస ప్రాంతాల నుంచి బయటకు తప్పించుకునే అవకాశం ఉంది.
వివరాలు
సూక్ష్మజీవుల కాలుష్యం వల్ల చంద్రుడిపై జరిగేది అదే..
ఇలాంటి సూక్ష్మజీవుల కాలుష్యం వల్ల చంద్రుడిపై ఉన్న పురాతన భౌగోళిక లేదా జీవరసాయన ఆనవాళ్లను గుర్తించే పరిశోధనలకు ఆటంకం కలగవచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇదే సమయంలో చంద్రుడిని ఒక సహజ ప్రయోగశాలగా ఉపయోగించి.. వాస్తవ చంద్ర వాతావరణంలో సూక్ష్మజీవులు ఎంతకాలం మనుగడ సాగించగలవో పరీక్షించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మనుషుల ద్వారా అక్కడికి ఎలాంటి సూక్ష్మజీవులు చేరే అవకాశం ఉందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
నాసాగోడార్డ్కు చెందిన పరిశోధకుడు, ఆర్టెమిస్ మిషన్లో చంద్రుడి నమూనాల కాలుష్య నియంత్రణ శాస్త్రవేత్త ఆండ్రూ నీధమ్ ఈ విషయంపై స్పందించారు.
మనుషులు చంద్రుడిపైకి చేరకముందు అక్కడి సహజ వాతావరణం ఎలా ఉందో పూర్తిగా తెలుసుకోవడం కీలకమని ఆయన అన్నారు.
వివరాలు
వెచ్చగా, తేమగా ఉండే ప్రదేశాల్లో ఫంగస్
భవిష్యత్తులో అంగారకుడిపై భూమికి చెందని జీవం కోసం అన్వేషణ చేపట్టినప్పుడు కూడా ఇదే అంశం చాలా కీలకంగా మారుతుందని నీధమ్ తెలిపారు.
అక్కడ గుర్తించిన ఏదైనా జీవ సంబంధమైన సంకేతం అంగారకుడి నుంచే వచ్చిందని నిర్ధారించుకోవాల్సి ఉంటుందని.. అది భూమి నుంచి వెళ్లిన సూక్ష్మజీవుల వల్ల ఏర్పడలేదని నిర్ధారించడం అవసరమని పేర్కొన్నారు.
ఈ పరిశోధనలో 'ఆస్పర్జిల్లస్ నైగర్' అనే ఫంగస్ను కూడా పరిశీలించారు.
సాధారణంగా వెచ్చగా, తేమగా ఉండే ప్రదేశాల్లో ఈ ఫంగస్ పెరుగుతుంది.
ఇళ్లలోని బాత్రూమ్లు, హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (HVAC) వ్యవస్థల్లో ఇది కనిపిస్తుంది.