Page Loader
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కేరళలో మ్యాన్‌హోల్ శుభ్రం చేయడానికి కోసం రోబోటిక్ స్కావెంజర్‌
KSUM 2022 కాన్‌క్లేవ్‌లో 'కేరళ ప్రైడ్' అవార్డును అందుకుంది

ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కేరళలో మ్యాన్‌హోల్ శుభ్రం చేయడానికి కోసం రోబోటిక్ స్కావెంజర్‌

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 27, 2023
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాన్యువల్ స్కావెంజింగ్ అనేది భారతదేశంలో మామూలే, హానికరమైన వాయువుల వలన ఈ పని చేసే వారి ఆరోగ్యం దెబ్బతినవచ్చు. భారతదేశంలో 2017 నుండి సుమారు 400 మంది ఈ మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రపరిచే క్రమంలో మరణించారు. ఈ సమస్యకు పరిష్కారంగా కేరళ ప్రభుత్వం మ్యాన్‌హోల్స్‌లోని మురుగునీటిని శుభ్రపరిచే బాండికూట్ అనే రోబోటిక్ స్కావెంజర్‌ను ప్రారంభించింది. త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్‌లో ఈ రోబో మ్యాన్‌హోల్ శుభ్రం చేసే కార్మికులకు విశ్రాంతిని అందిస్తోంది. బాండికూట్ ను కేరళకు చెందిన జెన్‌రోబోటిక్స్ భారతదేశంలో రూపొందించి, ఇక్కడే తయారు చేసింది. ఇది మనుషులతో పోలిస్తే మ్యాన్‌హోల్స్‌ను మరింత బాగా శుభ్రం చేయగలదు. 2018లో, తిరువనంతపురంలో ప్రారంభించి తర్వాత ఎర్నాకులం ఇప్పుడు గురువాయూర్‌లో దీనిని ప్రవేశపెట్టారు

కేరళ

KSUM 2022 కాన్‌క్లేవ్‌లో 'కేరళ ప్రైడ్' అవార్డును అందుకుంది

గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన కేరళ స్టార్టప్ మిషన్ (KSUM) హడల్ గ్లోబల్ 2022 కాన్‌క్లేవ్‌లో 'కేరళ ప్రైడ్' అవార్డును అందుకుంది. ఇప్పుడు, మ్యాన్‌హోల్‌లను శుభ్రం చేయడానికి రోబోలను ఉపయోగించిన భారతదేశపు మొట్ట మొదటి రాష్ట్రం కేరళ. బాండికూట్‌లో రెండు విభాగాలు ఉన్నాయి- ఒక స్టాండ్, రోబోటిక్ డ్రోన్ యూనిట్.డ్రోన్ యూనిట్ కు వాటర్ రెసిస్టెన్స్ ఉంది ఇది మురుగునీటిని తొలగించడానికి మ్యాన్‌హోల్‌లోకి ప్రవేశిస్తుంది. డ్రోన్‌లో హానికరమైన వాయువులు, రాళ్ళు, ఇసుక, సిల్ట్, బురద వంటివి గుర్తించే సెన్సార్లు HD కెమెరాలు కూడా ఉన్నాయి. ఇది 10 మీటర్ల వరకు డైవ్ చేయగలదు, ఒకేసారి 125 కిలోల బరువు వరకు ఎత్తగలదు.