LOADING...
WTC Rankings: ఫైనల్ బెర్త్‌కు చేరువైన ఆసీస్.. సొంత గడ్డపై వైట్‌వాష్‌తో ఆరో ర్యాంక్‌లో టీమిండియా
ఫైనల్ బెర్త్‌కు చేరువైన ఆసీస్.. సొంత గడ్డపై వైట్‌వాష్‌తో ఆరో ర్యాంక్‌లో టీమిండియా

WTC Rankings: ఫైనల్ బెర్త్‌కు చేరువైన ఆసీస్.. సొంత గడ్డపై వైట్‌వాష్‌తో ఆరో ర్యాంక్‌లో టీమిండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 09, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) ర్యాంకింగ్స్‌లో సమీకరణాలు కాస్త మారాయి. స్వదేశంలో ముగిసిన యాషెస్ సిరీస్‌ (Ashes Series)లో ఇంగ్లండ్‌ను 4-1తో చిత్తు చేసిన ఆస్ట్రేలియా తన అగ్రస్థానం నిలబెట్టుకుంది. తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఆసీస్‌ 87.50 శాతంతో ఫైనల్‌ బెర్త్‌కి మరింత చేరువ అయ్యాయి. మరోవైపు సొంత గడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు ఆరో ర్యాంక్‌లోనే కొనసాగుతోంది. యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జోరుతో WTC నంబర్‌ 1 ర్యాంక్ కాపాడుకుంది. ఇటీవల వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన న్యూజిలాండ్‌ 77.78 శాతం విజయాలతో రెండో ర్యాంక్ సాధించింది. గత సీజన్ విజేత దక్షిణాఫ్రికా మూడో స్థానంలో నిలవగా, శ్రీలంక 66.67 శాతం విజయాలతో నాల్గో ర్యాంక్ పొందింది.

Details

మూడో ర్యాంకులో న్యూజిలాండ్

పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉండగా, భారత్ ఆరో ర్యాంక్‌నే కొనసాగిస్తోంది. తర్వాతి టెస్టు సీజన్‌లో భారత్ కోసం సవాళ్లు ఎక్కువే. డబ్ల్యూటీసీలో వరుసగా రెండుసార్లు ఫైనల్ ఆడిన భారత్ హ్యాట్రిక్ ఆశలను ఈసారి సొంత గడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో క్లీన్‌స్వీప్ మళ్లీ ఆవిరవ చేసింది. దీంతో భారత జట్టు మూడు నుంచి ఐదో స్థానంలోకి దిగింది. అయితే, రెండో టెస్టులో శుక్రవారం వెస్టిండీస్‌ను 9 వికెట్లతో చిత్తు చేసిన న్యూజిలాండ్ మూడో ర్యాంక్‌కి ఎగబాకగా, భారత సీనియర్‌ ఆటగాళ్లను ఆధారంగా గిల్ సేన ర్యాంకు ఆరుకు దిగజారింది. కొత్త ఏడాదిలో టీమిండియా ఐదు మాత్రమే టెస్టులు ఆడనుంది.

Details

ఈ ఏడాది ఐదు టెస్టులు మాత్రమే ఆడనున్న భారత్

జూన్‌లో అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు, ఆగస్టులో శ్రీలంక పర్యటనలో రెండు, అక్టోబర్‌లో న్యూజిలాండ్ గడ్డపై రెండు మ్యాచులు ఉన్నాయి. ఈ ఐదు మ్యాచుల్లో గెలిచినప్పటికీ, టాప్-3లోని జట్ల ఫలితాలపై భారత జట్టు ఫలితాలు, ముఖ్యంగా శుభ్‌మన్ గిల్ సేన ప్రదర్శనపై ఆధారపడనుండే అవకాశం ఉంది.

Advertisement