
BCCI: భారత మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసిన బీసీసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) 2024-25 సీజన్ కోసం భారత మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది.
ఈసారి మొత్తం 16 మంది మహిళా క్రికెటర్లకు BCCI కాంట్రాక్ట్ అందజేసింది.
క్రికెటర్లను మూడు గ్రేడ్లుగా విభజించారు. ఇందులో గ్రేడ్ A లో ముగ్గురు, గ్రేడ్ B లో నలుగురు, గ్రేడ్ C లో తొమ్మిది మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు.
ఈ కాంట్రాక్ట్ 2024 అక్టోబర్ 1 నుండి 2025 సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుంది.
వివరాలు
గ్రేడ్ వారీగా మహిళా క్రికెటర్లు.. వార్షిక పారితోషికం
గ్రేడ్ A (₹50 లక్షలు) : హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ
గ్రేడ్ B (₹30 లక్షలు) : రేణుకా ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షెఫాలీ వర్మ
గ్రేడ్ C (₹10 లక్షలు) : యస్తికా భాటియా, రాధా యాదవ్, శ్రేయంకా పాటిల్, తితాస్ సాధు, అరుందతి రెడ్డి, అమన్జోత్ కౌర్, ఉమా చేత్రి, స్నేహ్ రాణా, పూజా వస్త్రకర్
వివరాలు
పురుష,మహిళా కాంట్రాక్ట్ల మధ్య తేడా
బీసీసీఐ మహిళా,పురుష క్రికెటర్లకు సమానమైన మ్యాచ్ ఫీజును అందిస్తున్నప్పటికీ,వార్షిక కాంట్రాక్ట్లో మాత్రం భారీ తేడా ఉంది.
పురుషుల కాంట్రాక్ట్లో A+ గ్రేడ్ ఉంది,దీంట్లో ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి ₹7 కోట్లు చెల్లిస్తారు.
పురుషుల A గ్రేడ్ లో ₹5 కోట్లు,B గ్రేడ్ లో ₹3 కోట్లు,C గ్రేడ్ లో ₹1 కోటి అందజేస్తారు.
ఈ భారీ వ్యత్యాసంపై మహిళా క్రికెట్ అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.
పురుషులకంటే మహిళా క్రికెటర్లకు తక్కువ మొత్తాన్ని కాంట్రాక్ట్ కింద చెల్లించడం న్యాయమా? అనే ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.
అయితే,గత కొన్నేళ్లుగా మహిళా క్రికెట్కు బీసీసీఐ మరింత ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నప్పటికీ, ఇంకా పురుషుల స్థాయిలో సమానమైన పారితోషికాన్ని అందించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీసీసీఐ విమెన్ చేసిన ట్వీట్
🚨 News 🚨
— BCCI Women (@BCCIWomen) March 24, 2025
BCCI announces annual player retainership 2024-25 - Team India (Senior Women)#TeamIndia pic.twitter.com/fwDpLlm1mT