NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Team India: ఎలాంటి మార్పులు లేకుండానే ఫైనల్‌లో ఆడాలి.. మేనేజ్‌మెంట్‌కు సూచించిన సునీల్ గావస్కర్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Team India: ఎలాంటి మార్పులు లేకుండానే ఫైనల్‌లో ఆడాలి.. మేనేజ్‌మెంట్‌కు సూచించిన సునీల్ గావస్కర్ 
    ఎలాంటి మార్పులు లేకుండానే ఫైనల్‌లో ఆడాలి.. మేనేజ్‌మెంట్‌కు సూచించిన సునీల్ గావస్కర్

    Team India: ఎలాంటి మార్పులు లేకుండానే ఫైనల్‌లో ఆడాలి.. మేనేజ్‌మెంట్‌కు సూచించిన సునీల్ గావస్కర్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 07, 2025
    12:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వరుస విజయాలతో ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) ఫైనల్‌ కి వచ్చిన భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది.

    ఈ పోరు ఆదివారం దుబాయ్‌లో జరగనుంది. తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనేది క్రికెట్ ప్రేమికుల కోసం ఆసక్తికర అంశంగా మారింది.

    ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం తుది జట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదని స్పష్టం చేశారు.

    గత రెండు మ్యాచుల్లో ఎలా ఆడారో అలాగే, నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సూచించారు.

    అయితే కొన్ని ముఖ్యమైన అంశాల్లో టీమిండియా మెరుగైతే, ఫైనల్‌లో ఘన విజయాన్ని సాధించడం కచ్చితం అని గావస్కర్ అభిప్రాయపడ్డారు.

    వివరాలు 

    ఓపెనర్ల నుంచి మెరుగైన ఆరంభం అవసరం 

    ''ఇప్పటి వరకు భారత ఓపెనర్ల నుంచి భారీ స్కోరు రాలేదు. కానీ ఫైనల్‌లో తప్పకుండా అలా జరగాలని ఆశిస్తున్నా. ఈ విషయంలో టీమ్‌ఇండియా మరింత మెరుగవ్వాలి.

    అదేవిధంగా, కొత్త బంతితో తొలి ఓవర్లలో మరిన్ని వికెట్లు తీయడం ముఖ్యం.

    కనీసం 2 లేదా 3 వికెట్లు తీయగలిగితే జట్టుకు పెద్ద ప్రయోజనం ఉంటుంది. మిడిల్‌ ఓవర్లలో వికెట్లు తీయడం కాస్త తక్కువగా కనిపిస్తోంది.

    పరుగులను కట్టడి చేస్తున్నా, వికెట్లు పడగొడితే ప్రత్యర్థి జట్టుపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఈ అంశాల్లో భారత జట్టు మెరుగుపడాలి. అలా జరిగితే ఫైనల్ గెలిచే అవకాశం చాలా ఎక్కువ'' అని గావస్కర్ విశ్లేషించారు.

    వివరాలు 

    మార్పులు అవసరం లేదు 

    ''భారత్ తుది జట్టులో (IND vs NZ) ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు.

    నలుగురు స్పిన్నర్లతోనే ఆడాలి. ఎందుకు మార్పులు చేయాలి? చక్రవర్తి, కుల్దీప్ లు జట్టులో ఉండటంతో బౌలింగ్ బలపడింది.

    వారిని తుది జట్టులోకి తీసుకోవడం మేనేజ్‌మెంట్ తీసుకున్న సరికొత్త నిర్ణయం.

    వికెట్లు తీయడమే కాకుండా, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో డాట్‌ బాల్స్ వేయడం చాలా ముఖ్యమైన అంశం.

    వీరిద్దరూ ఆ విషయంలో అద్భుతంగా రాణిస్తున్నారు. గ్రూప్‌ స్టేజ్‌లో ఇప్పటికే భారత స్పిన్నర్లు న్యూజిలాండ్‌పై చక్కని ప్రదర్శన కనబరిచారు.

    దుబాయ్ పిచ్ కూడా స్పిన్నర్లకు సహకరిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో భారత్ ఎలాంటి మార్పులు లేకుండా ఫైనల్‌ XIలో బరిలోకి దిగాలి'' అని గావస్కర్ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సునీల్ గవాస్కర్

    తాజా

    India Pak Conflict: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత? ఒమర్ అబ్దుల్లా
    Airspace: భారత్-పాక్ కాల్పుల విరమణతో పాక్ గగనతలానికి గ్రీన్ సిగ్నల్ పాకిస్థాన్
    Cease Fire Violation: రెచ్చిపోయిన పాక్.. భారత్‌పై మళ్లీ దాడులు భారతదేశం
    Vikram Misri: యుద్ధానికి ఫుల్‌స్టాప్.. భారత్ సంచలన ప్రకటన భారతదేశం

    సునీల్ గవాస్కర్

    గెలిస్తేనే కెప్టెన్లను గుర్తు పెట్టుకుంటారు.. రోహిత్ శర్మపై గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! రోహిత్ శర్మ
    Sunil Gavaskar : భారత్.. వినడానికి వినసంపుగా ఉంది : సునీల్ గవాస్కర్ వీరేంద్ర సెహ్వాగ్
    టీమిండియాపై గవాస్కర్ ప్రశంసలు.. కొత్తబంతితో పాక్ కంటే భారత బౌలింగ్‌ అటాక్ భేష్ టీమిండియా
    సూర్యకుమార్ యాదవ్‌కు వరల్డ్ జట్టులో చోటు కష్టమే : సునీల్ గవాస్కర్ సూర్యకుమార్ యాదవ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025