NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్! 
    తదుపరి వార్తా కథనం
    IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్! 
    బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్!

    IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    12:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నిలిపివేశారు.

    హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ భద్రతా కారణాలతో మ్యాచ్‌ను నిలిపివేసినట్లు ప్రకటించింది.

    ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించి, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు తక్షణమే వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు.

    జమ్ముకశ్మీర్, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో పాకిస్థాన్ దాడులు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    మ్యాచ్ రద్దు తర్వాత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఐపీఎల్ అధికారులతో పాటు ప్రేక్షకులు స్టేడియాన్ని ఖాళీ చేశారు.

    ఈ సమయంలో ఓ ఛీర్‌లీడర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.

    Details

    ఆటగాళ్ల కోసం ప్రత్యేక రైలు సదుపాయం

    వీడియోలో ఆమె చెప్పిన వివరాల ప్రకారం స్టేడియం మొత్తం ఖాళీ అయిపోయింది. మ్యాచ్ మధ్యలోనే అందరినీ పంపించారు.

    చుట్టూ భయభ్రాంతి వాతావరణం. బాంబులు పడతాయేమోనన్న భయం ప్రతి ఒక్కరిలో ఉంది. ధర్మశాల విడిచి వెళ్లడం చాలా బాధగా ఉంది.

    ఐపీఎల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు. కానీ ఇప్పటికీ నేను ఎందుకు ఏడవడం లేదు తెలియడం లేదు... షాక్ లోనే ఉన్నానని ఆమె పేర్కొంది.

    ఇక బీసీసీఐ ఆటగాళ్ల కోసం ప్రత్యేక రైలు సదుపాయం కల్పించింది.

    ధర్మశాలలో విమానాశ్రయాల సేవలు నిలిపివేయడంతో వందే భారత్ రైలు ద్వారా ప్లేయర్లను ఢిల్లీకి తరలించారు.

    రెండు జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్ అధికారులు అందులో ప్రయాణించనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐపీఎల్
    పాకిస్థాన్

    తాజా

    IPL 2025: బాంబుల భయం.. స్టేడియం మొత్తం ఖాళీ.. ఛీర్‌లీడర్ వీడియో వైరల్!  ఐపీఎల్
    Manoj Sinha: యూరీకి జమ్మూకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా.. ఎందుకంటే ! ఆపరేషన్‌ సిందూర్‌
    Tirumala: తిరుమలలో హై అలెర్ట్..భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం తిరుమల తిరుపతి
    Vikram Doraiswami: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ సైన్యం.. ఆధారాలతో బయటపెట్టిన భారత్ భారతదేశం

    ఐపీఎల్

    RCB-PBKS:  సొంత గడ్డపై చతికిల పడిన  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 5 వికెట్ల తేడాతో  పంజాబ్ కింగ్స్ గెలుపు  క్రీడలు
    RR Vs LSG: జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నేడు లక్నోతో రాజస్థాన్ రాయల్స్ పోరు..  క్రీడలు
    IPL 2025: ఐపీఎల్‌-18లో యువ ఆటగాళ్లు దూకుడుపై ప్రత్యేక కథనం క్రీడలు
    IPL 2025: 14 ఏళ్లలోనే ఐపీఎల్‌లో దుమ్మురేపిన వైభవ్.. అతని తర్వాత ఎవరున్నారంటే? క్రికెట్

    పాకిస్థాన్

    Shehbaz Sharif: భారత్‌లో.. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ యూట్యూబ్‌ ఛానల్‌ బ్లాక్‌  భారతదేశం
    Asia Cup 2025: ఆసియా కప్ 2025 పై ఉగ్రదాడి ప్రభావం..? ఇండియా-పాక్ మ్యాచ్‌పై సస్పెన్స్! భారతదేశం
    Indian Navy: ఎప్పుడైనా, ఎక్కడైనా సిద్ధమే.. త్రిశూల శక్తి చూపించిన నేవీ భారతదేశం
    Pakistan: పహల్గాం దాడి అనంతరం పాక్‌ క్షిపణి ప్రయోగం ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025