Page Loader
T 20 సారిథిగా హార్థిక్ పాండ్యా..!
హర్థిక్ పాండ్యా

T 20 సారిథిగా హార్థిక్ పాండ్యా..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2022
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్ టైటాన్స్ జట్టులో అద్భుతంగా రాణించిన హర్థిక్ పాండ్యాకు అరుదైన అవకాశం లభించనుంది. కెప్టెన్సీ బాధ్యత నుంచి రోహిత్ శర్మను తప్పించి, టీ20 అల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు టీ20 సారథిగా నియమించే అవకాశం ఉంది. T20 WCలో పేలవప్రదర్శన చేసిన రోహిత్ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో హార్థిక్ తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని BCCI భావిస్తోందని సమాచారం. జనవరి 3 నుంచి ముంబైలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భారత్‌కు నాయకత్వం వహించే అవకాశం ఉందని ఒక నివేదిక పేర్కొంది. జనవరి 5న పూణే, జనవరి 7న రాజ్ కోట్ లో మ్యాచ్ లు జరగనున్నాయి.

రోహిత్ శర్మ

T20 కెప్టెన్సీ నుంచి రోహిత్ తప్పుకుంటాడా..?

రోహిత్ శర్మ బొటన వేలి గాయం నయం కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అర్థమవుతోంది. అయితే, రోహిత్‌ను T20 కెప్టెన్సీ నుండి తప్పుకుంటాడా లేదా అనే విషయంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో భారత T20 కెప్టెన్సీపై ఎటువంటి చర్చ జరగలేదని తెలుస్తోంది. ఆఫీస్ బేరర్‌గా ఉన్న బీసీసీఐ ఓల్డ్ గార్డ్ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జే షాలకు ఒక సూచన చేశారు. "రోహిత్ హోమ్ గ్రౌండ్ అయిన వాంఖడేలో తొలి టీ20 ఉంది. సెలెక్టర్లు, బీసీసీఐ సెక్రటరీ (షా) రోహిత్ కు టీ20 మ్యాచ్ లో అక్కడే వీడ్కోలు పలికితే బాగుంటుందని తెలిపారు.