Loading...
Australia: 2027 వరల్డ్‌కప్ ఫార్మాట్‌పై అసంతృప్తి.. ఐసీసీకి ఆస్ట్రేలియా కీలక సూచన!
2027 వరల్డ్‌కప్ ఫార్మాట్‌పై అసంతృప్తి.. ఐసీసీకి ఆస్ట్రేలియా కీలక సూచన!

Australia: 2027 వరల్డ్‌కప్ ఫార్మాట్‌పై అసంతృప్తి.. ఐసీసీకి ఆస్ట్రేలియా కీలక సూచన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2026
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాబోయే 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం జట్ల పరిమాణాన్ని (స్క్వాడ్ సైజ్) పెంచాలని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ఐసీసీకి సూచించారు. ప్రపంచకప్‌లో మ్యాచ్‌ల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో ప్రస్తుత 15 మంది సభ్యుల జట్టు సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. 2027 ప్రపంచకప్‌లో కొత్త ఫార్మాట్ ఇటీవల 2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి ఐసీసీ కొత్త టోర్నీ నిర్మాణాన్ని ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీలో 14 జట్లు పాల్గొంటాయి. గ్రూప్ దశకు ముందు సూపర్ సిరీస్ రౌండ్ ను కూడా ప్రవేశపెట్టనున్నారు.

వివరాలు

గాయాలే ప్రధాన సమస్య

2019, 2023 ప్రపంచకప్‌లలో గాయాల కారణంగా ఆస్ట్రేలియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.

ముఖ్యంగా గత ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లను కేవలం 14 మంది ఫిట్ ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చిందని మెక్‌డొనాల్డ్ గుర్తు చేశారు.

అందుకే ఈసారి మ్యాచ్‌లు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున జట్లలో ఆటగాళ్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

SEN రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెక్‌డొనాల్డ్ మాట్లాడుతూ.. ప్రపంచకప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో 15 మంది సభ్యులతో కూడిన జట్టు సరిపోదన్నారు.

గత ప్రపంచకప్ ప్రారంభంలోనే గాయాల కారణంగా తమ వద్ద ఎంపికకు 12 నుంచి 13 మంది ఆటగాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నారని గుర్తు చేశారు.

వివరాలు

ఆటగాళ్ల పనిభారం కూడా కీలకం

2027 ప్రపంచకప్‌కు ముందు వచ్చే 14 నెలల్లో ఆస్ట్రేలియా జట్టు పలు టెస్టు సిరీస్‌లు ఆడనుంది.

ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌, పనిభారాన్ని సమతుల్యం చేయడం జట్టు యాజమాన్యానికి సవాల్‌గా మారనుంది.

వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, కెమెరూన్ గ్రీన్ వంటి కీలక ఆటగాళ్లు టెస్టులతో పాటు ప్రపంచకప్‌లోనూ ఆడే అవకాశముండటంతో వారి ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు

ఐసీసీ నిర్ణయం మారే అవకాశం తక్కువ

అయితే, ప్రస్తుతానికి 15 మంది సభ్యుల స్క్వాడ్ విధానాన్నే ఐసీసీ కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రతి జట్టుకు మ్యాచ్‌ల మధ్య కనీసం రెండు రోజుల విరామం ఉండేలా షెడ్యూల్ రూపొందించే అవకాశముంది.

అసోసియేట్ జట్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి

టోర్నీ ఫార్మాట్‌పై కూడా మెక్‌డొనాల్డ్ స్పందించారు. కొత్త విధానం వల్ల అసోసియేట్ దేశాలకు కొంత నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.

టీ20 క్రికెట్‌లో అసోసియేట్ జట్లు గణనీయంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, 50 ఓవర్ల ప్రపంచకప్‌లో కూడా వారికి మరిన్ని అవకాశాలు కల్పిస్తారని తాను ఆశించానని ఆయన పేర్కొన్నారు.

ADVERTISEMENT