LOADING...
Rohit Sharma: మరోసారి వడ పావ్ ఆఫర్ చేసిన అభిమాని.. రోహిత్ శర్మ రిప్లై ఇదే..!
మరోసారి వడ పావ్ ఆఫర్ చేసిన అభిమాని.. రోహిత్ శర్మ రిప్లై ఇదే..!

Rohit Sharma: మరోసారి వడ పావ్ ఆఫర్ చేసిన అభిమాని.. రోహిత్ శర్మ రిప్లై ఇదే..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 07, 2026
09:19 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌ పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో తెలిపే ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో, ఓ అభిమాని రోహిత్‌ను చూసి మరాఠీలో వడపావ్ తినమని అడిగాడు. "రోహిత్ భయ్యా, వడపావ్ పాహిజే కా?" అని అడిగాడు. దీనికి రోహిత్ నవ్వుతూ, చేతితో సైగ చేసి మెల్లగా "లేదు" అని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. టెస్టులు,టీ20 ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోహిత్ తన పూర్తి దృష్టిని ఫిట్‌నెస్‌ పెంపుపై కేంద్రీకరించారు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ శారీరకంగా చాలా మార్పులకు లోనయ్యాడు.

వివరాలు 

గతేడాది వన్డేల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు సృష్టించిన హిట్‌మ్యాన్ 

ప్రస్తుతం రోహిత్ విజయ్ హజారే ట్రోఫీ‌లో ముంబై జట్టు తరుపున ఆడుతున్నారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు సిద్ధం అవుతున్నారు. ప్రాక్టీస్ ఫోటోలను కూడా రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.గత సంవత్సరం రోహిత్ శర్మ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఆయన సారథ్యంలో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోగా,ఫైనల్‌లో 76పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే,కెరీర్‌లో తొలిసారిగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నారు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా షాహిద్ అఫ్రిది(351 సిక్సర్లు)రికార్డును అధిగమిస్తూ, ప్రస్తుతం 279 వన్డేల్లో 355 సిక్సర్లతో రోహిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000పరుగులు పూర్తి చేసిన నాల్గో భారత ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ ఘనత సాధించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌లో ఘటన 

Advertisement