NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / BCCI: టెస్ట్ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల ఇన్సెంటీవ్
    తదుపరి వార్తా కథనం
    BCCI: టెస్ట్ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల ఇన్సెంటీవ్
    BCCI: టెస్ట్ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల ఇన్సెంటీవ్

    BCCI: టెస్ట్ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల ఇన్సెంటీవ్

    వ్రాసిన వారు Stalin
    Mar 09, 2024
    04:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    Test Cricket Incentive Scheme: యువ ఆటగాళ్లలో టెస్టు క్రికెట్ పట్ల ఉత్సాహాన్ని పెంచేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) టెస్ట్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది.

    ఈ మేరకు 'టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్'ను ప్రారంభిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు.

    ప్రతి సీజన్‌లో 7కంటే ఎక్కువ టెస్టులు ఆడే ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల వరకు ఇవ్వబడుతుంది.

    గతంలో భారత క్రికెటర్లు ఒక టెస్టు ఆడినందుకు రూ.15లక్షలు చెల్లించేవారు.

    ఈ కొత్త పథకం ద్వారా రెగ్యులర్ టెస్టులు ఆడే క్రికెటర్లు ఆర్థికంగా భారీగా ప్రయోజనం పొందుతారు.

    ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ మాత్రమే ఆడే క్రికెటర్లు, యువ క్రికెటర్లలో టెస్టు క్రికెట్‌పై ఆసక్తిని పెంచేందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    బీసీసీఐ

    ప్లేయింగ్ లెవెన్‍లో లేని వారికి రూ.రూ.22.5 లక్షలు

    2022-23 సీజన్ నుంచి 'టెస్ట్ క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్'ను అమలు చేయనున్నట్లు జైషా వెల్లడించారు.

    కొత్త స్కీమ్ ప్రకారం.. ఒక సీజన్‌లో భారత్ తరఫున 75 శాతానికి పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లకు ఒక్కో టెస్టు మ్యాచ్‌కు అదనంగా రూ.45 లక్షల ప్రోత్సాహకం అందజేస్తారు.

    ప్ర‌స్తుతం, ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ఒక్కో టెస్ట్ క్రికెట‌ర్‌కు మ్యాచ్ ఫీజుగా రూ.15 లక్షలు చెల్లిస్తోంది.

    ఈ పథకం కోసం బీసీసీఐ ఒక్కో సీజన్‌కు రూ.40 కోట్లు అదనంగా చెల్లించనుంది.

    75 శాతం కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లకు ఎంపికై.. ప్లేయింగ్ ఎలెవన్‌లో లేని వారికి ఒక్కో మ్యాచ్‌కి అదనంగా రూ.22.5 లక్షల మ్యాచ్ ఫీజును బీసీసీఐ అందజేయనుంది.

    బీసీసీఐ

    ప్లేయింగ్ లెవెన్‌లో లేని ఆటగాళ్ల ఫీజు రెట్టింపు 

    కొత్త పథకం ప్రకారం.. ఒక క్రికెటర్ ఒక సీజన్‌లో 4 లేదా అంతకంటే తక్కువ టెస్టులు ఆడితే.. సాధారణ మ్యాచ్ ఫీజు రూ.15లక్షలు చెల్లిస్తారు.

    అతను ప్లేయింగ్ లెవెన్‌లో ఉన్నా.. లేకున్నా రూ.15లక్షలు ఇవ్వబడుతుంది.

    ఒక క్రికెటర్ ఒక సీజన్‌లో 5 నుంచి 6 మ్యాచ్‌లు ఆడితే.. ప్లేయింగ్ లెవెన్‌లో ఉంటే రూ.30 లక్షలు అందుతాయి.

    ప్లేయింగ్ లెవెన్‌లో లేకపోతే రూ.15 లక్షలను బీసీసీ ఇస్తుంది.

    అంతకు ముందు ప్లేయింగ్ లెవెన్‌లో లేని ఆటగాళ్లకు బీసీసీఐ రూ.7.5లక్షల మాత్రమే చెల్లించేది ఇప్పుడు ఆ ఫీజును రెట్టింపు చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీసీసీఐ
    క్రికెట్
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    బీసీసీఐ

    ఉమెన్స్ ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ భారతి పవార్
    విండీస్ టూర్ షెడ్యూల్‌ను ఖరారు చేసిన బీసీసీఐ.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే? టీమిండియా
    యువ ఆల్‌రౌండర్లను సానబట్టే పనిలో నిమగ్నమైన బీసీసీఐ క్రికెట్
    బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ పోస్టుకు దరఖాస్తులు.. అర్హతలివే! టీమిండియా

    క్రికెట్

    Punjab Kings : ఐపీఎల్‌ వేలంలో పొరపడిన పంజాబ్ కింగ్స్.. ఒక ఆటగాడి బదులు మరొకరిని! ఐపీఎల్
    Ram charan: క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేసిన రామ్ చరణ్  రామ్ చరణ్
    Best Cricketers Of 2023: ఈ ఏడాది అత్యుత్తమ క్రికెటర్లు వీళ్లే..! టీమిండియా
    WTC 2025: డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ కోసం టీమిండియా కసరత్తు టీమిండియా

    తాజా వార్తలు

    AAP: ఆప్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. జూన్ 15లోగా పార్టీ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని ఆదేశం ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    BRS: నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్  భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    #ModiKaParivar : 'లాలూ' ఎఫెక్ట్.. సోషల్ మీడియాలో బీజేపీ 'మోదీ కా పరివార్' ప్రచారం  లాలూ ప్రసాద్ యాదవ్
    Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై క్షిపణిదాడి.. ఒక భారతీయుడు మృతి, ఇద్దరికి గాయాలు ఇజ్రాయెల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025