NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / ICC : భారత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ‌లో భారత్ మ్యాచులకు అదనపు టికెట్లు
    తదుపరి వార్తా కథనం
    ICC : భారత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ‌లో భారత్ మ్యాచులకు అదనపు టికెట్లు
    భారత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ‌లో భారత్ మ్యాచులకు అదనపు టికెట్లు

    ICC : భారత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ‌లో భారత్ మ్యాచులకు అదనపు టికెట్లు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 16, 2025
    03:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు మ్యాచ్‌లు చూడాలనుకునే అభిమానులకు ఐసీసీ గుడ్‌న్యూస్ చెప్పింది.

    అదనంగా టికెట్లను విడుదల చేయాలని నిర్ణయించడంతో పాటు, మధ్యాహ్నం నుంచే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది.

    ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్ల విషయానికొస్తే, మొదటి సెమీ ఫైనల్ ముగిశాక అవి విడుదల చేసే అవకాశముంది.

    టీమిండియా ఫైనల్‌కు చేరితే, ఆ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగనుంది. దీంతో ఫైనల్ వేదిక ఖరారు కావాలంటే, మొదటి సెమీస్ ఫలితం రావాల్సి ఉంటుంది.

    గ్రూప్ స్టేజ్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది.

    ఆ తర్వాత ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడనుంది. తొలిసెమీఫైనల్ మార్చి 4న జరగనుంది.

    Details

    భారత్ సెమీస్ లో గెలిస్తే ఫైనల్ మ్యాచ్ లాహోర్ లోనే

    'భారత్‌ తొలి మ్యాచ్‌ కోసం ఇప్పటికే టికెట్లు అందుబాటులో ఉంచారు. అలాగే పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లను వీక్షించాలనుకునే అభిమానుల కోసం కూడా టికెట్లు సిద్ధంగా ఉన్నాయి.

    అదనంగా మరికొన్ని టికెట్లను విడుదల చేశారు. అయితే సెమీస్‌ టికెట్ల పరిమితి ఉంటుందని, ఇక ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లు ఇప్పుడే విడుదల చేయలేదన్నారు.

    భారత్‌ సెమీస్‌ గెలిచి ఫైనల్‌కు వస్తే దుబాయ్‌లో ఆతిథ్యం ఇస్తామని, లేకపోతే, టైటిల్ పోరు లాహోర్‌లోనే జరగనుందని ఐసీసీ స్పష్టం చేసింది.

    ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.

    పాకిస్థాన్ ఆతిథ్యంతో టోర్నమెంట్‌ జరగనుంది. ఫిబ్రవరి 19న పాకిస్థాన్ - న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ
    టీమిండియా

    తాజా

    Tollywood: సినీ సమస్యల పరిష్కారానికి ఫిల్మ్ ఛాంబర్ కీలక అడుగు..! 30 మందితో ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు టాలీవుడ్
    Chandrababu: పార్టీకి చెడ్డపరు తెస్తే ఉపేక్షించం : సీఎం చంద్రబాబు హెచ్చరిక చంద్రబాబు నాయుడు
    Palla Simhachalam: టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత! విశాఖపట్టణం
    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ తెలంగాణ

    ఐసీసీ

    WTC Final: 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు తేదీలు ప్రకటించిన ఐసీసీ క్రీడలు
    Womens T20 Worldcup 2024: పురుషులతో సమానంగా.. మహిళల టి20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ..  టీ20 ప్రపంచకప్‌
    T20 World Cup 2024: Icc మహిళల T20 ప్రపంచ కప్ అధికారిక పాట విడుదల టీ20 ప్రపంచకప్‌
    IND vs PAK: టాస్ ఓడిన భారత్.. పాకిస్థాన్ బ్యాటింగ్ టీమిండియా

    టీమిండియా

    Arshdeep Singh: ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా అర్ష్‌దీప్‌ సింగ్‌ ఐసీసీ
    IND vs ENG : తిలక్ వర్మ విధ్వంసం.. ఇంగ్లండ్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ తిలక్ వర్మ
    Rohit Sharma: ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం.. రోహిత్‌కు వీరాభిమాని లేఖ  రోహిత్ శర్మ
    Mohammed Siraj: సింగర్‌తో డేటింగ్ రూమర్స్‌పై సిరాజ్ స్పందన .. ఆ ఒక్క మాటతో అందరిని సైలెంట్ చేశాడు మహ్మద్ సిరాజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025