LOADING...
Hardik Pandya: హార్దిక్ పాండ్య 'పోస్టర్ సెంటిమెంట్' మరోసారి నిజమవుతుందా?
హార్దిక్ పాండ్య 'పోస్టర్ సెంటిమెంట్' మరోసారి నిజమవుతుందా?

Hardik Pandya: హార్దిక్ పాండ్య 'పోస్టర్ సెంటిమెంట్' మరోసారి నిజమవుతుందా?

వ్రాసిన వారు Moogati Shabari
May 30, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్ తుది దశకు చేరుకుంది. టైటిల్ కోసం జరిగే ఫైనల్ పోరుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ అర్హత సాధించాయి. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ సోషల్ మీడియాలో మళ్లీ చర్చనీయాంశంగా మారింది. గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న ఈ యాదృచ్ఛిక పరిణామం ఈసారి కూడా కొనసాగుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

వివరాలు

కెప్టెన్లతో ఫోటో షూట్..

ఐపీఎల్ ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు అన్ని పది జట్ల కెప్టెన్లతో ప్రత్యేక ఫొటోషూట్ నిర్వహించడం ఆనవాయితీ. ఆ ఫొటో ఆధారంగా ట్రోఫీతో పాటు కెప్టెన్లందరినీ చూపిస్తూ ఐపీఎల్ యాజమాన్యం ఒక అధికారిక పోస్టర్ విడుదల చేస్తుంది. 2022లో హార్దిక్ పాండ్య నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్‌గా నిలిచింది. అయితే 2023 నుంచి ఒక ప్రత్యేక సెంటిమెంట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. 2026 సీజన్ పోస్టర్‌లో హార్దిక్ పక్కన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఇదే సమయంలో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరుకోవడంతో ఈ సెంటిమెంట్ మరోసారి నిజమవుతుందా అనే చర్చ మొదలైంది.

వివరాలు

2023లో జరిగినది ఇదే..

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్‌గా అవతరించింది. ఎంఎస్ ధోని సారథ్యంలో సీఎస్‌కే ఐదోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ సీజన్‌కు ముందు విడుదలైన కెప్టెన్ల పోస్టర్‌లో హార్దిక్ పాండ్య పక్కనే ధోని నిలిచాడు. ఆసక్తికరంగా, ఫైనల్ మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని సీఎస్‌కే, హార్దిక్ పాండ్య సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Advertisement

వివరాలు

2024లో కూడా పునరావృతం..

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫైనల్‌కు చేరాయి. తుది పోరులో విజయం సాధించిన కేకేఆర్ దాదాపు పదేళ్ల తర్వాత తన మూడో ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఆ సీజన్‌కు ముందు విడుదల చేసిన అధికారిక పోస్టర్‌లో హార్దిక్ పాండ్య పక్కన కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. అదే ఏడాది హార్దిక్ ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

Advertisement