IND vs ZIM 2nd T20: సిరీస్పై గురి పెట్టిన భారత్.. రెండో టీ20లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండొచ్చు?
ఈ వార్తాకథనం ఏంటి
జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి పోరులో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు.. ఇప్పుడు రెండో మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించి సిరీస్ను ఖాయం చేసుకోవాలని భావిస్తోంది. భారత్-జింబాబ్వే మధ్య రెండో టీ20 మ్యాచ్ నేడు (జూలై 25) హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరగనుంది. తొలి మ్యాచ్కు కూడా ఇదే మైదానం ఆతిథ్యం ఇచ్చింది. మొదటి టీ20లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా పేసర్ మయాంక్ యాదవ్ తొలి బంతికే వికెట్ పడగొట్టి ప్రత్యర్థి జట్టుపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు.
వివరాలు
బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ..
అనంతరం ఇతర బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బంతులు వేయడంతో జింబాబ్వేను 125 పరుగులకే కట్టడి చేశారు.
అదే ప్రదర్శనను రెండో మ్యాచ్లోనూ పునరావృతం చేయాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.
హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్ తొలి మ్యాచ్లో వేగ బౌలర్లకు బాగా సహకరించింది.
ఆరంభ ఓవర్లలో పిచ్లో తేమ ఉండటంతో బంతి స్వింగ్ అవడంతో పాటు మంచి బౌన్స్ కూడా లభించింది.
దీంతో బ్యాటర్లకు స్వేచ్ఛగా పరుగులు చేయడం కష్టమైంది. రెండో టీ20లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అందువల్ల టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వివరాలు
అతని స్థానంపైనే చర్చ..
తొలి మ్యాచ్లో భారత విజయానికి యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ప్రధాన కారణంగా నిలిచాడు.
కేవలం 18 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి టీమిండియాను సునాయాస విజయతీరాలకు చేర్చాడు.
అంతేకాదు, అంతర్జాతీయ క్రికెట్లో ఏ ఫార్మాట్లోనైనా అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా కొత్త చరిత్ర సృష్టించాడు.
దీంతో రెండో మ్యాచ్లో కూడా అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ తొలి మ్యాచ్లో ఒక్క పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన సిరీస్లో కూడా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో రెండో టీ20లో అతని స్థానంపై చర్చ మొదలైంది.
వివరాలు
యువ పేసర్ యశ్ ఠాకూర్కు తొలి అంతర్జాతీయ మ్యాచ్..
ఈ నేపథ్యంలో భారత జట్టులో ఒక మార్పు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫామ్లో లేని అభిషేక్ శర్మ స్థానంలో పంజాబ్ కింగ్స్ వికెట్కీపర్ బ్యాటర్ ప్రభ్సిమ్రన్ సింగ్కు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుతంగా రాణించిన ప్రభ్సిమ్రన్ వరుసగా రెండో ఏడాది 500కు పైగా పరుగులు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
అయితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మిగతా స్థానాల్లో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించడం లేదు.
మరోవైపు యువ పేసర్ యశ్ ఠాకూర్కు తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
వివరాలు
టీమిండియా జట్టు ఇదే..
భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు మరో ఆసక్తికరమైన రికార్డు కూడా ఎదురుచూస్తోంది.
ఇప్పటివరకు టీ20ల్లో కెప్టెన్గా వ్యవహరించిన ప్రతిసారి టాస్ గెలిచిన అయ్యర్.. ఈ మ్యాచ్లో కూడా టాస్ తనవైపే వస్తే ఆ అరుదైన రికార్డును కొనసాగించినట్లవుతుంది.
రెండో టీ20లోనూ గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను సొంతం చేసుకుంటుంది.
కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఇదే తొలి ద్వైపాక్షిక టీ20 సిరీస్ విజయం అవుతుంది.
భారత్ అంచనా ప్లేయింగ్ XI: వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్.