LOADING...
Zimbabwe T20 Series: భారత టీ20 జట్టులో సంజు ఔట్.. జింబాబ్వే సిరీస్‌కు ఆరు మార్పులు
భారత టీ20 జట్టులో సంజు ఔట్.. జింబాబ్వే సిరీస్‌కు ఆరు మార్పులు

Zimbabwe T20 Series: భారత టీ20 జట్టులో సంజు ఔట్.. జింబాబ్వే సిరీస్‌కు ఆరు మార్పులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

వరుసగా మూడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో నిరాశపరిచిన భారత ఓపెనర్ సంజు శాంసన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌కు తుది జట్టులో చోటు కోల్పోయిన అతడు, ఈ నెల చివరిలో జరిగే జింబాబ్వే పర్యటనకు కూడా ఎంపిక కాలేదు. జులై 23, 25, 26 తేదీల్లో హరారే వేదికగా జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత సెలక్టర్లు ప్రకటించిన జట్టులో సంజు పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. అయితే అతడిని ఎంపిక చేయకపోవడానికి కారణం విశ్రాంతినా, లేక సెలక్టర్ల నిర్ణయమా అనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సంజు శాంసన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

వివరాలు 

ఇంగ్లాండ్‌ రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం

వరుసగా 97 నాటౌట్‌, 89, 89 పరుగులతో మూడు కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత జట్టు టైటిల్‌ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత ఆడిన చివరి మూడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 5, 0, 1 పరుగులకే పరిమితమవడంతో అతడిపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో సంజును పక్కనపెట్టి యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. ఇక జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఇంగ్లాండ్‌తో ఆడుతున్న జట్టుతో పోలిస్తే మొత్తం ఆరు మార్పులు చోటుచేసుకున్నాయి. సంజు శాంసన్‌తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా,అర్ష్‌దీప్ సింగ్,వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌లకు కూడా ఈ సిరీస్‌కు విశ్రాంతి లేదా అవకాశం లేకుండా పోయింది.

వివరాలు 

నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబే

మరోవైపు రింకు సింగ్, మయాంక్ యాదవ్ మళ్లీ భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు. అలాగే యశ్ ఠాకూర్, అశోక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, హర్ష్ దూబే తొలిసారిగా భారత టీ20 జట్టులో స్థానం సంపాదించారు. అదే సమయంలో గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని నితీశ్ కుమార్ రెడ్డి ఇంగ్లాండ్‌తో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆల్‌రౌండర్ శివమ్ దూబేను భారత సెలక్టర్లు జట్టులోకి ఎంపిక చేశారు.

Advertisement

వివరాలు 

జింబాబ్వేతో టీ20లకు భారత జట్టు:

శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, శివమ్‌ దూబె, సూర్యాంశ్‌ షెడ్జే, రింకు సింగ్, హర్ష్‌ దూబె, వరుణ్‌ చక్రవర్తి, ప్రిన్స్‌ యాదవ్, యశ్‌ ఠాకూర్, అశోక్‌ శర్మ, మయాంక్‌ యాదవ్‌.

Advertisement