NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / న్యూజిలాండ్ సిరీస్ పై భారత్ గురి..!
    తదుపరి వార్తా కథనం
    న్యూజిలాండ్ సిరీస్ పై భారత్ గురి..!
    3-0తో శ్రీలంకను చిత్తు చేసిన భారత్

    న్యూజిలాండ్ సిరీస్ పై భారత్ గురి..!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 16, 2023
    02:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే సిరీస్ లను భారత్ కైవసం చేసుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ పై భారత్ కన్ను పడింది. ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగంలో రాణిస్తున్న టీమిండియా న్యూజిలాండ్‌తో జరిగే పోరుకు సిద్ధమవుతోంది. న్యూజిలాండ్ కూడా పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను సాధించి, ఆత్మ విశ్వాసంతో ఉంది.

    వన్డేలకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా వ్యవహరించనున్నారు. జనవరి 18 నుండి మొదలవుతున్న సిరీస్‌లో టీమిండియా మూడు వన్డేల సిరీస్, మూడు టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. వన్డే సిరీస్‌లలో కనిపించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టి20 సిరీస్‌కి ఎంపిక కాలేదు.

    విరాట్ కోహ్లీ

    మరో రికార్డుకు చేరువలో కోహ్లీ

    స్వదేశంలో జరిగిన వన్డేల్లో భారత్‌ న్యూజిలాండ్‌పై గట్టి ఆధిపత్యం ఉంది. స్వదేశంలో కివీస్‌తో ఆడిన 35 మ్యాచ్‌ల్లో 26 విజయాలను భారత్ సాధించింది.

    విరాట్ కోహ్లి తన చివరి నాలుగు వన్డేల్లో మూడు సెంచరీలతో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. పేసర్ మహ్మద్ సిరాజ్ భారత్ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.

    భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వన్డే ఫార్మాట్‌లో 1,000 పరుగులు పూర్తి చేసి మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. 119 పరుగులు విరాట్ కోహ్లీ చేస్తే అంతర్జాతీయంగా 25వేల పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలవనున్నాడు. మరో ఐదు వికెట్లు తీస్తే 400 అంతర్జాతీయ వికెట్లు తీసిన ఆటగాడిగా షమీ చరిత్రకెక్కనున్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారత జట్టు
    క్రికెట్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    భారత జట్టు

    భారత్ టీంను ఢీకొట్టే శ్రీలంక జట్టు ఇదే.. శ్రీలంక
    యోయో ఫిట్‌నెస్ మళ్లీ వచ్చేసింది..! క్రికెట్
    ఈ ఏడాదైనా భారత్ విజయఢంకా మోగించేనా..? క్రికెట్
    'వన్డే ప్రపంచ కప్‌ను కచ్చితంగా గెలుస్తాం': హార్ధిక్ పాండ్యా క్రికెట్

    క్రికెట్

    బీసీసీఐ కార్యదర్శిపై పీసీబీ ఛీఫ్ సెటైర్లు భారతదేశం
    టెస్టులో సర్పరాజ్ అహ్మద్ సూపర్ సెంచరీ పాకిస్థాన్
    శ్రీలంకతో జరిగే మొదటి వన్డేలో అదే ఫామ్ కొనసాగేనా..! భారత జట్టు
    భారత్ బ్యాట్‌మెన్స్ రాణించకపోతే కష్టమే భారత జట్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025