IPL 2026: పంజాబ్కు షాకిచ్చిన ముంబై..వరుసగా 5వ ఓటమి
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో మ్యాచ్ 58లో పంజాబ్ కింగ్స్ (PBKS) ముంబయి ఇండియన్స్ (MI) చేతిలో ఓటమి పాలయ్యారు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో గురువారం జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ నిర్దేశించిన 200/8 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు విజయవంతంగా చేధించింది. చివరి బంతికి ఒక బంతి మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది.
వివరాలు
దీపక్ చాహర్ కట్టుదిట్టంగా బౌలింగ్..
ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ను ప్రియాంశ్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ జాగ్రత్తగా ప్రారంభించారు. మొదటి ఓవర్లో కేవలం 7 పరుగులే వచ్చాయి. ఆ తర్వాత రెండో ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ప్రభ్సిమ్రన్ రెండు బౌండరీలు కొట్టి వేగం పెంచాడు. ఒకవైపు దీపక్ చాహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ రన్స్ కట్టడి చేయగా, మరోవైపు ప్రియాంశ్ కూడా బుమ్రా బౌలింగ్లో కొంత మేర బౌండరీలు రాబట్టాడు. పవర్ప్లేలో పంజాబ్ 58/1 స్కోర్ చేసింది.
వివరాలు
దీపక్ చాహర్ అద్భత బౌలింగ్..
ఐదో ఓవర్లో షార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో ప్రభ్సిమ్రన్ మూడు ఫోర్లు కొట్టి ముంబైపై ఒత్తిడి తెచ్చాడు. అయితే పవర్ప్లే చివరి ఓవర్లో దీపక్ చాహర్ అద్భుతమైన లెంగ్త్ బాల్తో ప్రియాంశ్ను అవుట్ చేసి ముంబైకి మొదటి బ్రేక్ ఇచ్చాడు. అతను 17 బంతుల్లో 22 పరుగులు (4 ఫోర్లు) చేశాడు. తర్వాత ప్రభ్సిమ్రన్ దూకుడు కొనసాగిస్తూ 10వ ఓవర్లో రఘు శర్మపై రెండు సిక్సర్లు బాదాడు. కేవలం 29 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు. అయితే వెంటనే షార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో 32 బంతుల్లో 57 పరుగులు (6 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి అవుట్ అయ్యాడు.
వివరాలు
పంజాబ్ ఇన్నింగ్స్ సాగిందిలా..
ఆ తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ క్రమంగా కూలిపోయింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కేవలం 4 పరుగులకే ఔటవగా, రజ్ అంగద్ బావా 22 బంతుల్లో 21 పరుగులు చేసిన కూపర్ కానొలీని బౌల్డ్ చేశాడు. సూర్యాంశ్ షెడ్జ్ ఒక సిక్స్ కొట్టినా, షార్దూల్ ఠాకూర్ నెమ్మదైన బంతితో అతడిని అవుట్ చేశాడు. శశాంక్ సింగ్ ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. చివర్లో అజ్మతుల్లా ఒమర్జాయ్ మాత్రం ధాటిగా ఆడి ఒకే ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. 17 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టును 200 పరుగుల వరకు తీసుకెళ్లాడు.