NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు
    పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు

    Virender Sehwag: పాక్‌కు మర్చిపోలేని సమాధానం అందుతుంది.. భారత సైన్యానికి సెహ్వాగ్ మద్దతు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    11:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, 'ఆపరేషన్ సిందూర్' అనంతరం సరిహద్దుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

    పాక్ జరిపిన కాల్పులకు ప్రతిస్పందనగా భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. భారత సైన్యం లాహోర్‌తోపాటు పాకిస్థాన్‌లోని అనేక కీలక నగరాలపై సమర్థవంతమైన దాడులు జరిపింది.

    ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ భారత సైన్యానికి మద్దతుగా ట్వీట్ చేశారు.

    పాకిస్థాన్‌కు మౌనంగా ఉండే అవకాశమున్నా, ఆ దేశం యుద్ధాన్ని ఎంచుకుందని వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించారు.

    Details

    భారత సైన్యం తగిన సమాధానం చెబుతుంది

    ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ కలిసి పాకిస్థాన్‌కు మర్చిపోలేని బుద్ధి చెప్తాయని ఆయన పేర్కొన్నారు.

    'పాకిస్థాన్ మౌనంగా ఉండొచ్చును. కానీ కాల్పుల ద్వారా ఉగ్రవాదులను కాపాడాలన్నదే వారి లక్ష్యం. ఇది వాళ్ల స్వభావాన్ని చూపిస్తుంది. మన సైన్యం తగిన సమాధానం ఇస్తోంది.

    ఇది పాకిస్థాన్ ఎన్నటికీ మరిచిపోలేని రోజు అవుతుందంటూ సెహ్వాగ్ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    Details

    కరాచీలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

    ఇక సరిహద్దు కాల్పుల తర్వాత భారత్ చేపట్టిన ప్రతీకార చర్యలు అత్యంత వ్యూహాత్మకంగా సాగుతున్నాయి.

    భారత సైన్యం లాహోర్, కరాచీ నగరాలపై తీవ్రమైన దాడులు జరిపింది.

    కరాచీలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కరాచీ పోర్టులో 8 నుంచి 12 శక్తివంతమైన పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం.

    ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి చేపట్టిన దాడులు పాక్‌ను గుండె గుబురుగా మారేలా చేశాయి. భారత్ చేపట్టిన దాడులతో పాకిస్థాన్ దిగ్భ్రాంతికి గురైంది.

    వారి సైనిక దురాక్రమణకు తగిన రీతిలో సమాధానం ఇవ్వనున్నట్లు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో దాయాది దేశానికి కఠినమైన బుద్ధి చెబుతామని సంకేతాలు ఇచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వీరేంద్ర సెహ్వాగ్
    భారతదేశం

    తాజా

    India Test Squad: టీమిండియా టెస్టు సారథిగా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపిక శుభమన్ గిల్
    Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు చంద్రబాబు నాయుడు
    Travel India: వేసవిలో స్విట్జర్లాండ్‌ లాంటి అనుభవం.. భారతదేశపు మినీ హిల్ స్టేషన్లు ఇవే! భారతదేశం
    KTR: పార్టీ అధినేతకు సూచనలు ఇవ్వడం కోసం లేఖలు రాయొచ్చు : కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    వీరేంద్ర సెహ్వాగ్

    రూ.18 కోట్లతో అనుభవం రాదు.. కర్రన్ పై సెహ్వాగ్ ఫైర్ ఐపీఎల్
    అదిరిపోయే స్టైల్‌లో సచిన్ కు శుభాకాంక్షలు తెలిపిన సెహ్వాగ్ సచిన్ టెండూల్కర్
    ప్రతిసారీ ధోని రిటైర్మెంట్ గురించి ఎందుకు ప్రశ్నిస్తున్నారు : సెహ్వాగ్ ఫైర్ ఎంఎస్ ధోని
    టీమిండియా చీఫ్ సెలక్టర్‌‌గా సెహ్వాగ్.. కానీ! టీమిండియా

    భారతదేశం

    The Golconda Blue: భారత రాజుల అరుదైన ఆభరణం 'గోల్కొండ బ్లూ' వేలానికి సిద్ధం! వ్యాపారం
    Rains: రైతన్నలకు గుడ్‌న్యూస్.. ఈసారి సగటు కంటే 105% ఎక్కువ వర్షపాతం! వర్షాకాలం
    Arsenic: బియ్యంలో ఆర్సెనిక్‌ భయం.. ప్రపంచవ్యాప్తంగా 20% మందికి క్యాన్సర్‌ ముప్పు! క్యాన్సర్
    US Trade deal: ఇండియా మార్కెట్‌పై అమెరికా కన్ను.. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌కి మద్దతుగా ఒత్తిడి  అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025