LOADING...
Sai Sudharsan: సుదర్శన్ అజేయ సెంచరీతో భారత్-ఎకు బలమైన ఆరంభం
సుదర్శన్ అజేయ సెంచరీతో భారత్-ఎకు బలమైన ఆరంభం

Sai Sudharsan: సుదర్శన్ అజేయ సెంచరీతో భారత్-ఎకు బలమైన ఆరంభం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 04, 2026
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంక-ఎతో జరుగుతున్న రెండో అనధికార టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఎ బ్యాటర్లు ఆధిపత్యం చాటుతున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 247 పరుగులు నమోదు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ 184 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో అజేయంగా 104 పరుగులు చేసి శతకం పూర్తి చేశాడు. మరోవైపు దేవ్‌దత్ పడిక్కల్ 151 బంతుల్లో 11 ఫోర్లతో 94 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచి సెంచరీకి అత్యంత చేరువలో ఉన్నాడు. సుదర్శన్, పడిక్కల్ జోడీ రెండో వికెట్‌కు విడదీయరాని భాగస్వామ్యంగా 181 పరుగులు జోడించి జట్టుకు పటిష్టమైన స్థితిని కల్పించింది. అంతకుముందు ఓపెనర్ అమన్ 38 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

వివరాలు

తొలి ఇన్నింగ్స్ సాగిందిలా..

ఇక శ్రీలంక-ఎ తమ తొలి ఇన్నింగ్స్‌ను ఓవర్‌నైట్ స్కోరు 288/5తో కొనసాగించి చివరకు 366 పరుగులకు ఆలౌట్ అయింది. రాత్రి ఆట ముగిసే సమయానికి 86 పరుగులతో ఉన్న కెప్టెన్ సహన్, తన ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తూ 207 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 127 పరుగులు చేసి శతకం నమోదు చేశాడు. భారత్ బౌలర్లలో గుర్నూర్ బ్రార్ నాలుగు వికెట్లు (77 పరుగులకు), సారాంశ్ జైన్ నాలుగు వికెట్లు (92 పరుగులకు), యశ్ ఠాకూర్ రెండు వికెట్లు (46 పరుగులకు) పడగొట్టి ఆకట్టుకున్నా

Advertisement