LOADING...
IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. 201 పరుగులకే కుప్పకూలిన భారత్
సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. 201 పరుగులకే కుప్పకూలిన భారత్

IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. 201 పరుగులకే కుప్పకూలిన భారత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2025
03:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ కేవలం 201 పరుగులకే కుప్పకూలింది. మూడో రోజు ఆటను భారత్ 9/0 స్కోరుతో ప్రారంభించినప్పటికీ, పెద్ద స్కోరు సాధించడంలో పూర్తిగా విఫలమైంది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులకు ఆలౌటై, భారత్‌పై 288 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆధిక్యం ఉన్నప్పటికీ ప్రోటియాస్‌ టీమిండియాకు 'ఫాలోఆన్‌' ఇవ్వకుండా, రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. భారత్ టాప్-ఆర్డర్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ (58; 97 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే ఆకట్టుకున్నాడు. ఒక దశలో 95/1తో మంచి స్థితిలో ఉన్న భారత్, అకస్మాత్తుగా వరుస వికెట్లు కోల్పోయి 122/7తో పీకల్లోతు సమస్యల్లో పడిపోయింది.

Details

నిరాశపరిచిన టీమిండియా బ్యాటర్లు

కేఎల్ రాహుల్‌ (22), సాయి సుదర్శన్‌ 15) పెద్ద స్కోరు చేయలేకపోయారు. ధ్రువ్ జురెల్‌(0), రిషభ్ పంత్‌(7), రవీంద్ర జడేజా(6), నితీశ్ కుమార్ రెడ్డి (10)ఘోరంగా నిరాశపర్చారు. తదుపరి ఓటమిని తిప్పికొట్టేందుకు వాషింగ్టన్ సుందర్‌ (48; 92 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) మరియు కుల్‌దీప్‌ యాదవ్‌ (19; 134 బంతుల్లో) పోరాట హోదాలో నిలిచారు. ఈ జోడీ ఎనిమిదో వికెట్‌కు 208 బంతుల్లో 72 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించింది. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్‌ విధ్వంసకర ప్రదర్శనతో 6/48 ఫిగర్స్‌ నమోదు చేసి భారత్‌ను చిత్తు చేశాడు. సైమన్ హర్మర్ మూడు వికెట్లు, కేశవ్ మహరాజ్ ఒక్క వికెట్ తీసి భారత్‌ను 201 పరుగుల వద్దనే కట్టడి చేశారు.