Loading...
Shubman Gill: భారత్-సౌతాఫ్రికా తొలి టెస్ట్ పిచ్‌పై  గిల్ ఆందోళన.. రంగంలోకి దిగిన సౌరవ్ గంగూలీ 
రంగంలోకి దిగిన సౌరవ్ గంగూలీ

Shubman Gill: భారత్-సౌతాఫ్రికా తొలి టెస్ట్ పిచ్‌పై  గిల్ ఆందోళన.. రంగంలోకి దిగిన సౌరవ్ గంగూలీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య నవంబర్ 14న ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్ కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. అయితే, ఈ కీలక పోరుకు కేవలం నాలుగు రోజుల ముందు భారత కెప్టెన్ శుభమన్ గిల్ పిచ్ పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాక్టీస్ ముగిసిన తర్వాత గిల్ పిచ్‌ను పరిశీలించగా, అది ఎక్కువగా పొడిగా ఉండడం, గోధుమ రంగులో కనిపించడం ఆయనకు నచ్చలేదు. దీనిపై వెంటనే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) కొత్త అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ స్వయంగా రంగంలోకి దిగారు. ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా కోల్‌కతాకు చేరుకున్న తర్వాత, మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో తొలి ప్రాక్టీస్ సెషన్ నిర్వహించింది.

వివరాలు 

గిల్ పిచ్ క్యూరేటర్ చర్చ 

ఈ సెషన్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు మరో ఏడుగురు ఆటగాళ్లు మాత్రమే పాల్గొన్నారు.

దాదాపు మూడు గంటలపాటు ప్రాక్టీస్ అనంతరం కోచింగ్ సిబ్బంది పిచ్‌ను గమనించారు.

గిల్‌తో పాటు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ కూడా పిచ్‌ను సమీక్షించారు. వారి ప్రతిస్పందన చూస్తే టీమిండియా మేనేజ్‌మెంట్ పిచ్‌పై పూర్తిగా సంతృప్తి చెందలేదని స్పష్టమైంది.

తర్వాత గిల్ పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీని పిలిచి సుమారు 15 నిమిషాల పాటు చర్చించారు.

గడచిన వారం రోజులుగా ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై నీరు పట్టకపోవడంతో అది బాగా పొడిగా మారింది. కొద్దిపాటి పచ్చిక తప్ప మిగతా భాగం గోధుమ రంగులో ఉంది.

వివరాలు 

ప్రధాన పిచ్ కొంచెం పొడిగా ఉన్నా భారత జట్టు పూర్తిగా రాంక్ టర్నర్‌ కావాలని కోరలేదు: సౌరభ్ గంగూలీ  

ఇదే సమయంలో సౌతాఫ్రికా జట్టు తమ స్పిన్ ఆధారిత ప్రాక్టీస్ ముగించగానే CAB అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అక్కడికి వచ్చి స్వయంగా పిచ్‌ను పరిశీలించారు. ఆయన కూడా క్యూరేటర్‌తో పిచ్ పరిస్థితిపై చర్చించారు.

గంగూలీ మాట్లాడుతూ, "ప్రధాన పిచ్ కొంచెం పొడిగా ఉన్నా భారత జట్టు పూర్తిగా రాంక్ టర్నర్‌ కావాలని కోరలేదని" తెలిపారు.

అంటే, తొలి రోజు నుంచే బంతి తీవ్రంగా తిరగాలని టీమిండియా డిమాండ్ చేయలేదని ఆయన సూచించారు.

గంగూలీ పరిశీలన అనంతరం గ్రౌండ్ సిబ్బంది పక్కనున్న స్క్వేర్‌లకు నీరు పట్టారు.

ఈడెన్ గార్డెన్స్ ఇటీవల రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది.

ఆ మ్యాచ్‌లలో ఫాస్ట్ బౌలర్లు తొలి రోజు కష్టపడ్డా,తర్వాత రివర్స్ స్వింగ్ సహకారంతో వికెట్లు సాధించారు.

ADVERTISEMENT

వివరాలు 

సౌతాఫ్రికా జట్టులో పేస్, స్పిన్ బౌలింగ్ రెండూ బలంగా ఉన్నాయి

అయితే, పిచ్ పొడిగా ఉంటే అది సౌతాఫ్రికా స్పిన్ త్రయానికి అనుకూలంగా మారే అవకాశం ఉంది.

సౌతాఫ్రికా జట్టులో పేస్, స్పిన్ రెండూ సమంగా బలంగా ఉన్నాయి.

కగిసో రబాడా, మార్కో జాన్సెన్ వంటి వేగవంతమైన బౌలర్లు ఉన్నారు. అలాగే వారి స్పిన్ త్రయం ప్రస్తుతం అత్యంత శక్తివంతంగా ఉంది.

గత నెల పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌ను సమం చేయడంలో స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించారు.

సైమన్ హార్మర్ 13 వికెట్లు, సేనురన్ ముత్తుసామి 11, కేశవ్ మహారాజ్ 9 వికెట్లు తీసి మొత్తం 33 వికెట్లు పడగొట్టారు.

వీరిలో ముత్తుసామి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచి, బ్యాటింగ్‌లో కూడా 106 పరుగులు సాధించాడు.

ADVERTISEMENT