LOADING...
T20 World Cup 2026 : ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్ ఇండియా.. ఇంగ్లాండ్‌పై థ్రిల్లింగ్ విజయం  
ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్ ఇండియా.. ఇంగ్లాండ్‌పై థ్రిల్లింగ్ విజయం

T20 World Cup 2026 : ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్ ఇండియా.. ఇంగ్లాండ్‌పై థ్రిల్లింగ్ విజయం  

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2026
10:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెట్ జట్టు మరోసారి ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 2026 టీ20 వరల్డ్‌కప్‌లో గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో సెమీఫైనల్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమ్ ఇండియా ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ కూడా గట్టిగా పోరాడినా 7 వికెట్లకు 246 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఈ విజయంతో టీమ్ ఇండియా ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో నాలుగు ఫైనల్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.

వివరాలు 

నాలుగోసారి ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించిన టీమిండియా 

టీమ్ ఇండియా ఇప్పటివరకు మూడు సార్లు టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ఆడగా, అందులో రెండు సార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ పాకిస్థాన్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత 2014లో మరోసారి ఫైనల్‌కు చేరినా శ్రీలంక చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఇక 2024లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్ దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో గెలిచి రెండో టైటిల్‌ను అందుకుంది. ఇప్పుడు మళ్లీ 2026లో నాలుగోసారి ఫైనల్‌కు చేరి మరోసారి చరిత్ర సృష్టించింది.

వివరాలు 

ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో ఆడనున్న భారత్

ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్ న్యూజిలాండ్‌తో మార్చి 8న తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో మూడు టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు చెరో రెండు టైటిళ్లతో సమానంగా ఉన్నాయి. దీంతో ఫైనల్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.

Advertisement