Page Loader
Womens T20 World cup 2024: ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే!
ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే!

Womens T20 World cup 2024: ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2024
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళల జట్టు 2024 టీ20 ప్రపంచకప్‌ గెలవాలని గట్టి పట్టుదలతో ఉంది. అక్టోబర్ 3 నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా జరగనున్న ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ టోర్నీ కోసం ఆటగాళ్లను ప్రకటించారు. అయితే మహిళల టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1)పూనమ్ యాదవ్ మహిళల టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో పూనమ్ యాదవ్ అగ్రస్థానంలో నిలిచారు. 2014లో తన తొలి ప్రపంచకప్ మ్యాచ్ ఆడిన ఈ స్పిన్ బౌలర్, ఇప్పటివరకు 18 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు తీసింది. 13.82 సగటుతో, 5.6 ఎకానమీ రేటుతో పూనమ్, 4/19తో సత్తా చాటింది.

Details

2) రాధా యాదవ్ 

రాధా యాదవ్, టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. 12 మ్యాచ్‌లలో 16.94 సగటుతో 17 వికెట్లు రాధా సాధించింది. తన అత్యుత్తమ ప్రదర్శనగా 4/23గా ఉంది. 2018లో తన తొలి ప్రపంచకప్ మ్యాచ్ ఆడిన ఆమె, టీమిండియా బౌలింగ్ విభాగంలో కీలకంగా మారింది. 3) దీప్తి శర్మ ఈ జాబితాలో దీప్తి శర్మ మూడో స్థానంలో ఉన్నారు. 15 మ్యాచ్‌ల్లో 25.60 సగటుతో 15 వికెట్లను పడగొట్టింది. 3/15తో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. బౌలింగ్‌తో పాటు ఆమె ఆల్‌రౌండర్‌గానూ రాణిస్తోంది. భారత ఆటగాళ్లలో అతి ముఖ్యమైన సభ్యురాలిగా ఆమె తన ప్రతిభను చాటుతోంది.

Details

4) ప్రియాంక రాయ్, శిఖా పాండే

ప్రియాంక రాయ్, శిఖా పాండే ఇద్దరూ సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు. ప్రియాంక 2009లో తన తొలి మ్యాచ్‌లోనే 5/16తో అద్భుతమైన ప్రదర్శన చేసి 12 వికెట్లు సాధించింది. శిఖా పాండే 15 మ్యాచ్‌లలో 19.66 సగటుతో 12 వికెట్లు తీసి తన సామర్థ్యాన్ని నిరూపించింది. ఈ సారి టీ20 ప్రపంచకప్‌లో భారత బౌలింగ్ విభాగంలో పూనమ్, రాధా, దీప్తి లాంటి అత్యుత్తమ బౌలర్లతో మరింత పటిష్టంగా ఉంది.