
Vinesh Phogat: 'మూలన కూర్చుని ఏడవండి..': రూ.4 కోట్ల నగదు బహుమతిని తీసుకోవడాన్నిసమర్ధించుకున్న రెజ్లర్ వినేశ్ ఫొగాట్
ఈ వార్తాకథనం ఏంటి
పారిస్ ఒలింపిక్స్ నుంచి బరువు పరిమితి సమస్యల కారణంగా అనర్హతకు గురైన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తాజాగా మరో అంశంతో వార్తల్లో నిలిచింది.
హర్యానా ప్రభుత్వం ఆమెకు ప్రకటించిన రూ.4 కోట్ల నగదు బహుమతిని స్వీకరించడానికి అంగీకరించడాన్ని ఆమె సమర్థించుకుంది.
ఒలింపిక్స్ ఫైనల్కు చేరినప్పటికీ, మెడల్ సాధించకుండానే ఖాళీ చేతులతో తిరిగి రావాల్సి వచ్చిన వినేశ్... అయినప్పటికీ హరియాణా ప్రభుత్వం రజత పతక విజేతలకు అందజేసే రూ.4 కోట్ల ప్రోత్సాహక బహుమతిని ఆమెకు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
దీనిపై వినేశ్ ఒప్పుకోగా, సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శల వర్షం కురిసింది.
వివరాలు
నేను ఎప్పుడూ రాజీ పడలేదు
ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వినేశ్ స్పందించింది.
"నోర్మూసుకుని ఒక మూల కూర్చొని ఏడవండి. కోట్లు ఇస్తామని వచ్చినవారికి కూడా ప్రచారం చేయలేదని, ముఖ్యంగా శీతల పానీయాలు, ఆన్లైన్ గేమ్స్ వంటి వాటికి దూరంగా ఉన్నాను. నా విలువల విషయంలో నేను ఎప్పుడూ రాజీ పడలేదు. నేను ఇప్పటివరకు సాధించిన ప్రతిదీ నిజాయితీతో, కఠిన శ్రమతో సంపాదించాను" అని వినేశ్ ఎక్స్లో పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వినేశ్ చేసిన ట్వీట్
2 रुपये लेकर ट्वीट करने वालों और फ्री का ज्ञान बाँटने वालों… ज़रा ध्यान से सुनो!
— Vinesh Phogat (@Phogat_Vinesh) April 13, 2025
तुम्हारी जानकारी के लिए बता दूँ — अब तक करोड़ों के ऑफर ठुकरा चुकी हूँ।
सॉफ्ट ड्रिंक्स से लेकर ऑनलाइन गेमिंग तक,
पर मैंने कभी अपने उसूलों का सौदा नहीं किया।
जो कुछ भी हासिल किया है, मेहनत की…