LOADING...
#Viral Moment: మైదానంలో కోహ్లీ ఉత్సాహం.. రోహిత్ ఔట్ కాగానే విరాట్ ఘన సంబరాలు..!
మైదానంలో కోహ్లీ ఉత్సాహం.. రోహిత్ ఔట్ కాగానే విరాట్ ఘన సంబరాలు..!

#Viral Moment: మైదానంలో కోహ్లీ ఉత్సాహం.. రోహిత్ ఔట్ కాగానే విరాట్ ఘన సంబరాలు..!

వ్రాసిన వారు Moogati Shabari
May 10, 2026
10:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిమానుల దృష్టిని ఆకర్షించిన ఓ ప్రత్యేక ఘట్టం చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ కీలక బ్యాటర్ రోహిత్ శర్మ వికెట్ పడిన వెంటనే విరాట్ కోహ్లీ చేసిన ఉత్సాహభరిత సంబరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రత్యర్థి ఆటగాడని ఏమాత్రం పట్టించుకోకుండా, కోహ్లీ తనదైన శైలిలో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మైదానంలో హుషారుగా కనిపించాడు.

వివరాలు

తొలి ఓవర్లోనే పెవిలియన్..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ తొలి ఓవర్‌లోనే పెవిలియన్ చేరడంతో జట్టు బాధ్యతను రోహిత్ శర్మ తన భుజాలపై వేసుకున్నాడు. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదిన రోహిత్, ఆర్సీబీ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. కేవలం 9 బంతుల్లోనే 22 పరుగులు సాధించి ప్రమాదకరంగా మారుతున్న సమయంలో భువనేశ్వర్ కుమార్ బంతిని అందుకున్నాడు.

వివరాలు

భువీ అద్భుత బౌలింగ్.. కోహ్లీ ఉత్సాహ స్పందన..

భువనేశ్వర్ కుమార్ వేసిన కచ్చితమైన లెంగ్త్ బంతిని రోహిత్ శర్మ ఆడే ప్రయత్నంలో, బంతి బ్యాట్ అంచును తాకి వికెట్ కీపర్ జితేష్ శర్మ చేతుల్లోకి వెళ్లింది. దీంతో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ వికెట్‌తో స్టేడియంలో ఒక్కసారిగా ఉత్సాహ వాతావరణం నెలకొంది. అయితే ప్రేక్షకుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది విరాట్ కోహ్లీ స్పందనే. రోహిత్ వికెట్ జట్టుకు ఎంత కీలకమో అర్థం చేసుకున్న కోహ్లీ, గాల్లోకి ఎగిరి గట్టిగా సంబరాలు జరుపుకున్నాడు. రోహిత్ పెవిలియన్ వైపు నడుస్తుండగా కోహ్లీ ప్రదర్శించిన ఆ ఉత్సాహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో..

Advertisement