
Virat Kohli: విరాట్ కోహ్లీపై నిషేధం విధిస్తారా? ఐసీసీ నిబంధనలు ఏమి చెబుతున్నాయి?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్,ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన బాక్సింగ్ డే మ్యాచ్ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా జరుగుతుంది.
ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాకు చెందిన అరంగేట్ర బ్యాటర్ సామ్ కొంస్టాస్, భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ మధ్య వివాదం చోటుచేసుకుంది.
ఓవర్ ముగిసిన తర్వాత పిచ్పై అవతలి క్రీజు వైపు నడిచిపోతున్న కొంస్టాస్నుఅటుగా బంతిని పట్టుకుని వెళుతున్న కోహ్లీ అనుకోకుండా భుజంతో బలంగా ఢీకొట్టాడు.
మొదటి రోజు చోటుచేసుకున్న ఈ ఘటనలో , విరాట్ కోహ్లీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాలు
ఐసీసీ రూల్బుక్లోని 2.12 నిబంధన
విరాట్ ఈ చర్య ఉద్దేశపూర్వకంగా చేశాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఆసీస్ క్రికెట్ దిగ్గజాలు రికీ పాంటింగ్, మైఖేల్ వాన్ వంటి వారు కూడా కోహ్లీని తప్పుబడుతున్నారు.
ఐసీసీ ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక, ఈ తరహా ఘటనలు ఐసీసీ రూల్బుక్లోని 2.12 నిబంధన కింద వస్తాయని స్పష్టం చేయబడింది.
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, అంపైర్లు, మ్యాచ్ రిఫరీ లేదా ప్రేక్షకులు ఇలా అవాంఛనీయంగా శరీరాన్ని తాకితే ఈ రూల్ అమలులో ఉంటుంది.
వివరాలు
కోహ్లీకి 3-4 డీమెరిట్ పాయింట్లు
క్రికెట్లో ఇలాంటి ప్రవర్తనను ఐసీసీ నిషేధిస్తుంది. ఉద్దేశపూర్వకంగా లేదా నిర్లక్ష్యంగా ఇతర ఆటగాడితో ఈ విధంగా ప్రవర్తించడం నిబంధన ఉల్లంఘన అని పరిగణించబడుతుంది.
ఉల్లంఘన తీవ్రతను, దాని కారణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
ఉద్దేశపూర్వకంగా లేదా నిర్లక్ష్యంగా జరిగిందా అనేది అంచనా వేయాల్సి ఉంటుంది. ఆటగాళ్లతో మాట్లాడిన తర్వాత, మ్యాచ్ రిఫరీ ఈ తీవ్రతను నిర్ణయిస్తాడు.
ఈ విషయంలో, ఐసీసీ మ్యాచ్ రిఫరీ కే తుది నిర్ణయం ఉంటుంది. లెవల్-2 నేరంగా భావిస్తే, కోహ్లీకి 3-4 డీమెరిట్ పాయింట్లు ఇవ్వబడతాయి.
దీనితో అతను తదుపరి మ్యాచ్లో ఆడకపోవడానికి నిషేధం విధించబడవచ్చు. ఒకవేళ ఈ ఘటనను లెవల్-1 నేరంగా పరిగణిస్తే, జరిమానాతో సరిపెట్టవచ్చు.