NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan sectarian violence: ఖైబర్ పఖ్తున్ఖ్వాలో 10 మంది మృతి, 21 మందికి గాయాలు 
    తదుపరి వార్తా కథనం
    Pakistan sectarian violence: ఖైబర్ పఖ్తున్ఖ్వాలో 10 మంది మృతి, 21 మందికి గాయాలు 
    ఖైబర్ పఖ్తున్ఖ్వాలో 10 మంది మృతి, 21 మందికి గాయాలు

    Pakistan sectarian violence: ఖైబర్ పఖ్తున్ఖ్వాలో 10 మంది మృతి, 21 మందికి గాయాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 28, 2024
    08:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్ లో ముస్లింల మధ్య అంతర్గత విభేదాలు మరింత తీవ్రమయ్యాయి.

    ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో సున్నీ-షియా వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయపడ్డారు.

    పోలీసుల సమాచారం ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాలో ఈ ఘర్షణలు చెలరేగాయి.

    అలీజాయ్-బగన్ వర్గాల మధ్య గత వారం ప్రారంభమైన ఈ హింసాత్మక సంఘటనలు శుక్ర, శనివారాల్లో మరింత ఉధృతమయ్యాయి, దీంతో 37 మంది మరణించగా, అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది.

    అయితే, గురువారం కాన్వాయ్‌పై జరిగిన దాడికి ఎవరూ బాధ్యత వహించలేదని అధికారులు తెలిపారు.

    వివరాలు 

    ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం

    ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధుల చొరవతో, షియా,సున్నీ వర్గాల పెద్దల మధ్య సమావేశం నిర్వహించగా, ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

    అయినప్పటికీ, కుర్రం జిల్లాలో అక్కడక్కడా ఘర్షణలు కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

    మంగళవారం ఘోజాగరి, మతాసానగర్, కుంజ్ అలీజాయ్ ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు జరిగినట్లు సమాచారం.

    కుర్రం డిప్యూటీ కమిషనర్ జావేదుల్లా మెహసూద్ ప్రకారం, హంగూ,ఒరాక్జాయ్,కోహట్ జిల్లాలకు చెందిన మత పెద్దల సమక్షంలో శాంతి చర్చలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

    ఈ చర్చలకు కోహట్‌ కమిషనర్‌ నేతృత్వం వహించనున్నారని ఆయన తెలిపారు.

    వివరాలు 

    భూవివాదాలకు సంబంధించిన ఘర్షణలు 

    ఇదిలా ఉండగా, ఘర్షణల ప్రభావంతో పరాచినార్‌కు వెళ్లే రహదారులు మూసివేయబడటంతో, అక్కడ మందుల కొరత ఏర్పడినట్లు కుర్రం జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మీర్ హసన్ ఖాన్ వెల్లడించారు.

    సున్నీ ఆధిక్యం కలిగిన పాకిస్తాన్‌లో షియా ముస్లింలు సుమారు 15 శాతం జనాభాను కలిగివున్నారు.

    సాధారణంగా ఇరువర్గాలు శాంతియుతంగా జీవించినప్పటికీ, కుర్రం జిల్లాలో వివిధ కారణాలతో ఉద్రిక్తతలు తరచుగా చెలరేగుతూనే ఉన్నాయి.

    ప్రస్తుత ఘర్షణల మూలం భూవివాదాలకు సంబంధించినదిగా తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    పాకిస్థాన్

    Jai Shankar: పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి.. జై శంకర్‌ భారతదేశం
    Pakistan- IMF Deal: IMF ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ 1.5 లక్షల ఉద్యోగాల కోత.. ఆరు మంత్రిత్వ శాఖల రద్దు  అంతర్జాతీయం
    Babar Azam: కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్న బాబర్ ఆజమ్ బాబార్ అజామ్
    Pakistan: పాకిస్థాన్‌ క్రికెట్‌లో అలజడి.. ఆటగాళ్లకు కనీసం జీతం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో బోర్డు క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025