NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Nigeria: నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 19 మంది దుర్మరణం.. మహిళా ఆత్మాహుతి దళాల పనే 
    తదుపరి వార్తా కథనం
    Nigeria: నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 19 మంది దుర్మరణం.. మహిళా ఆత్మాహుతి దళాల పనే 
    నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 19 మంది దుర్మరణం.. మహిళా ఆత్మాహుతి దళాల పనే

    Nigeria: నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 19 మంది దుర్మరణం.. మహిళా ఆత్మాహుతి దళాల పనే 

    వ్రాసిన వారు Stalin
    Jun 30, 2024
    09:25 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నైజీరియాలో ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ సంఘటనలతో ఒక్కసారిగా నైజీరియా మొత్తం వణికిపోయింది.

    ఒకదాని తర్వాత మరోటి చోటుచేసుకోవడంతో భయాందోళన చెందారు. ఇక ఆత్మాహుతి దాడి సంఘటనల్లో 19 మంది చనిపోయారు. మరో 42 మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.

    గాయపడ్డ వారిలో 20 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    ఈశాన్య రాష్ట్రమైన బోర్నోలో ఈ ఆత్మాహుతి దాడులు జరిగాయి. స్థానిక రాష్ట్ర అత్యవసర నిర్వహణ సంస్థ ఈ సమాచారం అందించింది.

    బోర్నోలో బోకోహరాం ఉగ్రవాదులు గతంలో కూడా ఇదే తరహా దాడులు చేసి పలువురిని హతమార్చిన చరిత్ర వుంది.

    వివరాలు 

    మహిళా ఆత్మాహుతి బాంబర్ల పని కావచ్చు 

    మహిళా ఆత్మాహుతి బాంబర్లుగా ఏజెన్సీ అనుమానిస్తోంది. రాష్ట్ర ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ బార్కిండో సైదు మాట్లాడారు.

    అనుమానిత ఆత్మాహుతి బాంబర్లు వేర్వేరు చోట్ల వరుస దాడులకు పాల్పడ్డారని చెప్పారు. గ్వోజా నగరంలో ఒక పెళ్లి, అంత్యక్రియలు, ఆసుపత్రిపై ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారని తెలిపారు.

    మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. అయితే.. చనిపోయిన వారిలో గర్భిణులు, చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసిందని రాష్ట్ర ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ బార్కిండో సైదు తెలిపారు.

    వివరాలు 

    వేలాది మందిని హత్య చేసిన బోకోహరాం  

    మరోవైపు బోర్నో స్టేట్ పోలీసులు కూడా ఈ ఆత్మాహుతి దాడుల గురించి ప్రస్తుతం ఏమీ చెప్పలేదు. బోర్నో ఆఫ్ నైజీరియా చాలా ఉగ్రవాద గ్రూపులు చురుకుగా ఉన్న ప్రాంతం.

    దీంతో .. ఆత్మాహుతి దాడులు వారే జరిపి ఉంటారని తెలుస్తోంది. ఇస్లామిక్ స్టేట్‌తో చేతులు కలపడం ద్వారా నైజీరియాలో బోకో హరామ్ ఉగ్రవాద పరిధిని విస్తరించింది.

    బోకోహరాం ఇప్పటి వరకు వేలాది మందిని దారుణంగా హత్య చేసింది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నైజీరియా

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    నైజీరియా

    నైజీరియా: నదిలో పడవ బోల్తా పడి 103 మంది మృతి  తాజా వార్తలు
    నైజీరియా: బందిపోట్ల ఆకస్మిక దాడిలో 26 మంది సైనికులు మృతి  ఆర్మీ
    Nigeria Attack News : నైజీరియాలో ముష్కరుల దాడి: 40 మంది హత్య  అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025