Page Loader
Earthquakes: ఆప్ఘనిస్థాన్‌లో 4.7 తీవ్రతతో భూకంపం
ఆప్ఘనిస్థాన్‌లో 4.7 తీవ్రతతో భూకంపం

Earthquakes: ఆప్ఘనిస్థాన్‌లో 4.7 తీవ్రతతో భూకంపం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2025
09:25 am

ఈ వార్తాకథనం ఏంటి

మయన్మార్, థాయిలాండ్ శక్తివంతమైన భూకంపాల ప్రభావం నుంచి ఇంకా కోలుకోకముందే, శనివారం ఉదయం ఆప్ఘనిస్థాన్‌లో మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదైన ఈ ప్రకంపనలు ఉదయం 5.16 గంటల సమయంలో చోటుచేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూకంపం 180 కి.మీ లోతులో సంభవించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఇక శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపాల కారణంగా 150 మందికి పైగా మరణించగా, వందలాది మంది గాయపడ్డారు.

Details

థాయిలాండ్ లో అత్యవసర పరిస్థితి

రెస్క్యూ సిబ్బంది సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నప్పటికీ, శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ భూకంపాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని థాయిలాండ్ ప్రధాని అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంప కేంద్రం మయన్మార్ రాజధాని నేపిడా నుండి 250 కి.మీ దూరంలో ఉన్న సాగింగ్ నగరానికి 16 కి.మీ దూరంలో నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో 7.7, 6.4 తీవ్రతతో సంభవించిన భూకంపాలు మయన్మార్‌, థాయ్‌లాండ్ దేశాలను గజగజ వణికించాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆప్ఘనిస్తాన్ లో భూకంపం