NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / లీటరు పాలు రూ.210, కేజీ చికెన్ రూ.1,100; ధరల పెరుగుదలతో అల్లాడుతున్న పాక్
    తదుపరి వార్తా కథనం
    లీటరు పాలు రూ.210, కేజీ చికెన్ రూ.1,100; ధరల పెరుగుదలతో అల్లాడుతున్న పాక్

    లీటరు పాలు రూ.210, కేజీ చికెన్ రూ.1,100; ధరల పెరుగుదలతో అల్లాడుతున్న పాక్

    వ్రాసిన వారు Stalin
    Feb 14, 2023
    01:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్థిక సంక్షోభంతో దాయాది దేశం పాకిస్థాన్ అల్లాడిపోతోంది. నిత్యావసర వస్తువులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల్లోనే పాల ధరలు రూ. 30 వరకు పెరిగాయి. దీంతో పాక్‌లో లీటరు పాల ధర రూ. 210కి చేరింది.

    లైవ్ బ్రాయిలర్ చికెన్ ధర గత రెండు రోజుల్లో కిలోకు భారీగా పెరిగింది. ప్రస్తుతం లైవ్ పక్షి కేజీ 480-500 అమ్ముతున్నట్లు 'డాన్' పత్రిక నివేదించింది.

    రెండు రోజుల క్రితం కోడి మాంసం ధర రూ.620-650 ఉండగా, ప్రస్తుతం అది రూ.700-780 పెరిగినట్లు డాన్ వెల్లడించింది. బోన్ లెస్ చికెన్ కిలో రూ.1,000-1,100 పలుకుతున్నట్లు తెలిపింది.

    పాకిస్థాన్

    విద్యుత్, సుంకాలను పెంచిన పాక్ ప్రభుత్వం

    1,000 మంది దుకాణదారులు పాలను పెంచిన రేటుకు విక్రయిస్తున్నట్లు కరాచీ మిల్క్ రిటైలర్స్ అసోసియేషన్ మీడియా కోఆర్డినేటర్ వహీద్ వెల్లడించారు.

    తక్కువ విదేశీ నిల్వలు, నగదు కొరత కారణంగా పాకిస్థాన్ అత్యంత దారుణమైన ఆహార ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి( ఐఎంఎఫ్)తో ఒప్పందం సందిగ్ధంలో పడటంతో పాక్ పరిస్థితి మరింత దిగజారింది.

    తీవ్ర ఆర్థిక సంక్షోభం మధ్య పాకిస్థాన్ ప్రభుత్వం దేశంలో విద్యుత్, గ్యాస్ సుంకాలను కూడా పెంచింది.

    అవసరమైన డబ్బును అన్‌లాక్ చేయడానికి ఐఎంఎఫ్ అధికారులతో చర్చలు తిరిగి ప్రారంభించిన వెంటనే పాక్ ప్రభుత్వం పెరిగిన ధరలను అమలు చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    పాకిస్థాన్

    రమీజ్ భాయ్‌కు 4,5 సార్లు మెసేజ్ చేసినా.. రిప్లే ఇవ్వలేదు : పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ప్రపంచం
    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్
    పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్ సుబ్రమణ్యం జైశంకర్
    పాక్ ఆర్మీపై సంచలన ఆరోపణలు.. మోడల్స్‌తో రాజకీయ నాయకులకు ఎర! ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025