NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Congo: కాంగో నదిలో ఘోర ప్రమాదం.. 38 మంది మృతి.. వందకిపైగా గల్లంతు!
    తదుపరి వార్తా కథనం
    Congo: కాంగో నదిలో ఘోర ప్రమాదం.. 38 మంది మృతి.. వందకిపైగా గల్లంతు!
    కాంగో నదిలో ఘోర ప్రమాదం.. 38 మంది మృతి.. వందకిపైగా గల్లంతు!

    Congo: కాంగో నదిలో ఘోర ప్రమాదం.. 38 మంది మృతి.. వందకిపైగా గల్లంతు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 22, 2024
    10:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడటంతో 38 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు.

    ఈ ప్రమాదం కారణంగా 100 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. ప్రమాదానికి ప్రధాన కారణం పడవలోని ప్రయాణికుల సంఖ్య సామర్థ్యాన్ని మించిపోవడం అని అధికారులు వివరించారు.

    ఫెర్రీ బోటులో 400 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు స్థానికులు తెలిపారు.

    వారు క్రిస్మస్ వేడుకల కోసం తమ సొంతూళ్లకు తిరిగి వెళ్ళిపోతుండగా ఈ ప్రమాదం జరిగింది.

    Details

    మృతుల సంఖ్య పెరిగే అవకాశం

    గల్లంతైన వారిలో ఇప్పటివరకు 20 మందిని రక్షించగలిగారు. కానీ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెప్పారు.

    ఈ ప్రమాదానికి సంబంధించి, బోటు సిబ్బంది జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

    ఇటీవల, నాలుగు రోజుల క్రితం కూడా మరో ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఈ నేపథ్యంలో అధికారులు ప్రతి సమయంలో పడవ నిర్వహణకు హెచ్చరికలు జారీ చేస్తుండగా, కొంతమంది వాటిని పట్టించుకోకుండా ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచం
    ఇండియా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ప్రపంచం

    China: చైనాలో జననాల రేటు క్షీణత.. మూతపడుతున్న పాఠశాలలు  చైనా
    Russia Visa: పర్యాటకులకు శుభవార్త.. 2025 నుంచి రష్యాకు వీసా అవసరం లేదు! రష్యా
    JP Morgan : ఏటిఎంలలో నిధులు డ్రా చేసిన కస్టమర్లపై కేసులు నమోదు అమెరికా
    Air India: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం.. 60 విమాన సర్వీసుల రద్దు ఎయిర్ ఇండియా

    ఇండియా

    Emmy Awards 2024: న్యూయార్క్‌లో ఇంటర్నేషనల్ ఎమీ అవార్డ్స్‌ వేడుకలు భారతదేశం
    Sambhal violence : సంభాల్‌లో అల్లర్లు.. నలుగురు మృతి.. వందలాదిమందిపై కేసు నమోదు ఉత్తర్‌ప్రదేశ్
    Nana Patole: రాజీనామా చేయలేదు.. ఆ వార్తలన్నీ అబద్దం : నానా పటోలే మహారాష్ట్ర
    Andrapradesh: సైబీరియా నుంచి గుంటూరుకు చేరిన విదేశీ పక్షులు గుంటూరు జిల్లా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025