NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / భారత్‌లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అఫ్ఘానిస్థాన్‌ ప్రకటన.. కారణం ఇదే..
    తదుపరి వార్తా కథనం
    భారత్‌లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అఫ్ఘానిస్థాన్‌ ప్రకటన.. కారణం ఇదే..
    భారత్‌లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన

    భారత్‌లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అఫ్ఘానిస్థాన్‌ ప్రకటన.. కారణం ఇదే..

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 01, 2023
    10:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దిల్లీలోని తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం (అక్టోబర్‌ 1) నుంచి మూసివేస్తున్నట్లు ఆ దేశ సర్కార్ ప్రకటించింది.

    తమకు భారత ప్రభుత్వం నుంచి ఆశించిన రీతిలో సహకారం అందట్లేదని, ఈ క్రమంలోనే తమ రాయబార సేవల్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.

    మరోవైపు భారత్‌, అఫ్ఘానిస్థాన్‌ మధ్య ఉన్న చారిత్రక ద్వైపాక్షిక సంబంధాలతో పాటు మరెన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. అన్ని రకాలుగా ఆలోచించాకే దౌత్యపరమైన కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.

    అప్ఘాన్ పట్ల భారత్‌ ఆసక్తి చూపట్లేదని, రాయబార కార్యాలయంలోని సిబ్బంది, వనరులను తగ్గించిందని చెప్పింది.

    details

    భారత్‌లో అఫ్ఘాన్ రాయబారిగా ఫరీద్‌ మముంద్‌జాయ్‌ 

    ఈ క్రమంలోనే దిల్లీలో అప్ఘాన్ కార్యకలాపాలు కొనసాగించడంలో ఇక్కట్లు తలెత్తుతున్నాయని చెప్పుకొచ్చింది.

    తమకు మరోదారి లేక ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. భారత్‌కే అధికారాన్ని అప్పగించే వరకు అఫ్ఘాన్‌ పౌరులకు అత్యవసర కౌన్సిల్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించింది.

    దౌత్య సంబంధాలపై 1961లో జరిగిన వియన్నా కన్వెన్షన్ కు సంబంధించి ఆర్టికల్ 45 మేరకు రాయబార కార్యాలయం ఆస్తి, సౌకర్యాలు ఆతిథ్య దేశ సంరక్షక అధికారానికి బదిలీ చేయాలి.

    ప్రస్తుతం భారత్‌లో అఫ్ఘాన్ రాయబారిగా ఫరీద్‌ మముంద్‌జాయ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించకముందు అష్రఫ్‌ ఘనీ సర్కార్ ఫరీద్ ను నియమించింది.

    2021 ఆగస్టులో అఫ్ఘానిస్థాన్ పరిపాలన తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    ఆఫ్ఘనిస్తాన్
    ఆఫ్ఘనిస్తాన్

    తాజా

    BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు బంగ్లాదేశ్
    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ

    భారతదేశం

    2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనున్న భారత్ : డెలాయిట్‌ వృద్ధి రేటు
    G20 summit delhi: దిల్లీలో అట్టహాసంగా జీ20 సదస్సు.. దేశాధినేతలకు స్వాగతం పలికిన ప్రధాని మోదీ   జీ20 సమావేశం
     G20 summit 2023: ప్రధాని మోదీ సీటు ముందు నేమ్ ప్లేట్‌పై  'భార‌త్‌' పేరు జో బైడెన్
    Modi-Biden bilateral meet: ద్వైపాక్షిక సమావేశంలో మోదీ, బైడెన్ చర్చించిన అంశాలు ఇవే..  నరేంద్ర మోదీ

    ఆఫ్ఘనిస్తాన్

    అప్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్‌గా రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్
    స్కూళ్లు, కాలేజీల్లో బాలికల నిషేధంపై మాటమార్చిన తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్
    స్వదేశంలో మొట్టమొదటిసారి రూపొందిన సూపర్‌కార్ మాడా 9ను ఆవిష్కరించిన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్
    అప్ఘానిస్థాన్: దొంగతనానికి పాల్పడిన నలుగురి చేతులను నరికేసిన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్

    ఆఫ్ఘనిస్తాన్

    Pakistan Blast: పాకిస్థాన్ మసీదులో ఆత్మాహుతి దాడి, 25మంది మృతి పాకిస్థాన్
    పెషావర్ మసీదు పేలుడు ఇంటిదొంగ పనేనా? నిగ్గు తేల్చాలని పాకిస్థాన్‌లో నిరసనలు పాకిస్థాన్
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత భూకంపం
    అఫ్ఘనిస్థాన్: ఇస్లామిక్ స్టేట్ టాప్ కమాండర్‌ను హతమార్చిన తాలిబాన్ దళాలు ఆఫ్ఘనిస్తాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025