NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Sudan: సుడాన్‌లో రక్తపాతం.. పారామిలటరీ దాడుల్లో 100 మందికి పైగా మృతి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Sudan: సుడాన్‌లో రక్తపాతం.. పారామిలటరీ దాడుల్లో 100 మందికి పైగా మృతి
    సుడాన్‌లో రక్తపాతం.. పారామిలటరీ దాడుల్లో 100 మందికి పైగా మృతి

    Sudan: సుడాన్‌లో రక్తపాతం.. పారామిలటరీ దాడుల్లో 100 మందికి పైగా మృతి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 13, 2025
    09:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆఫ్రికా ఖండంలోని సూడాన్‌లో హింసాకాండ కొనసాగుతోంది.

    పారామిలటరీ సంస్థ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌ (RSF) బలగాలు తాజాగా పశ్చిమ సూడాన్‌లోని నార్త్ డార్ఫర్ ప్రాంతంలో దాడులకు పాల్పడ్డాయి. జామ్జామ్ శిబిరాల్లో నివసిస్తున్న పౌరులపై శుక్రవారం జరిపిన దాడిలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

    మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో తొమ్మిది మంది 'రిలీఫ్ ఇంటర్నేషనల్' అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన ఉద్యోగులు కూడా ఉన్నారు.

    శనివారం అబూషాక్ శిబిరంపై కూడా RSF బలగాలు దాడులు కొనసాగించాయి.

    ఈ ఘటనలో 14 మంది మరణించగా, మరో స్వచ్ఛంద సంస్థ సమాచారం ప్రకారం ఈ దాడుల్లో మొత్తం 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

    Details

     ఇప్పటివరకు 29,600 మందికి పైగా పౌరులు మృతి

    తీవ్రంగా గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ దాడులపై RSF బలగాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

    సూడాన్‌లో కల్లోలానికి కారణమైన ఈ ఘర్షణలు 2023 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యాయి.

    ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్-బుర్హాన్‌, మాజీ డిప్యూటీ, RSF కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య విభేదాల కారణంగా ఈ రెండు బలగాల మధ్య తీవ్ర పోరాటం చెలరేగింది.

    ఈ SAF (సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్) RSF మధ్య సుదీర్ఘ హింసాకాండలో ఇప్పటివరకు 29,600 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

    Details

    సుడాన్ ను వదిలి వెళ్లిపోయిన కోటిమంది ప్రజలు

    అంతేకాకుండా, దాదాపు కోటి మంది ప్రజలు సూడాన్‌ను వదిలి ఇతర దేశాలకు పాలాయించారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

    సూక్ష్మంగా చూస్తే, సూడాన్‌లోని హింసాత్మక పరిస్థితులు రోజు రోజుకు మరింత విషమంగా మారుతున్నాయి.

    పౌరులే కాకుండా సహాయ సంస్థల ఉద్యోగులు కూడా ఈ అల్లర్లకు బలైపోతుండడం ఆందోళన కలిగించే విషయంగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సూడాన్
    ప్రపంచం

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    సూడాన్

    సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం  భారతదేశం
    సూడాన్ పోరాటంలో 413 మంది మృతి: డబ్ల్యూహెచ్‌ఓ తాజా వార్తలు
    సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం  భారతదేశం
    ఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు విమానం

    ప్రపంచం

    US army: అమెరికా ఆర్మీలో ఆహార నిధుల దుర్వినియోగం.. నాసిరకం భోజనంతో సైనికుల ఆరోగ్యంపై ప్రభావం? అమెరికా
    zero for zero: అమెరికా ప్రతీకార సుంకాలకు చెక్‌!.. భారత్‌ 'సున్నా వ్యూహం' అమెరికా
    New China Virus: కరోనా తరహా కొత్త వైరస్!.. చైనాలో HKU5-CoV-2 గుర్తింపు చైనా
    Japan: జపాన్‌లో జనాభా సంక్షోభం.. జననాల రేటు 1899 తర్వాత అత్యల్పం! జపాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025