NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Cargo Vessels Attack: ఎర్ర సముద్రంలో రెండు కార్గో షిప్‌లపై హౌతీ రెబల్స్ దాడి
    తదుపరి వార్తా కథనం
    Cargo Vessels Attack: ఎర్ర సముద్రంలో రెండు కార్గో షిప్‌లపై హౌతీ రెబల్స్ దాడి
    Cargo Vessels Attack: ఎర్ర సముద్రంలో రెండు కార్గో షిప్‌లపై హౌతీ రెబల్స్ దాడి

    Cargo Vessels Attack: ఎర్ర సముద్రంలో రెండు కార్గో షిప్‌లపై హౌతీ రెబల్స్ దాడి

    వ్రాసిన వారు Stalin
    Dec 19, 2023
    05:16 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎర్ర సముద్రంలోని రెండు కార్గో షిప్‌లపై డ్రోన్ దాడులు చేసినట్లు యెమెన్ హౌతీ రెబల్స్ ప్రకటించారు.

    ఈ దాడి వల్ల ఎర్ర సముద్ర వాణిజ్యానికి అంతరాయం ఏర్పడింది. అనంతరం కార్గో కంపెనీలు తమ షిప్‌లను ఈ ప్రాంతం నుంచి దూరంగా తరలించాయి.

    నిత్యావసరాలు, ఇంధన సరఫరాలో ఎర్ర సముద్రం చాలా కీలకం.

    హౌతీ రెబల్స్ దాడుల నేపథ్యంలో ఎర్ర సముద్రం వాణిజ్య రవాణా నిలిచిపోయింది.

    దీంతో నిత్యావసరాలు, ఇంధన సరఫరా కొరత ఏర్పడి.. ధరలు పెరిగే అవకాశం ఉంది.

    చమురు, సహజ వాయువు, ఇతర ఇంధన సరఫరాలతో సహా ఎర్ర సముద్రం గుండా అన్ని రవాణాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కార్గో కంపెనీలు ప్రకటించాయి.

    ఎర్రసముద్రం

    టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడానికి ఇతర దేశాలతో అమెరికా చర్చలు

    హౌతీ తిరుగుబాటు దారులు దాడి చేసిన నౌకలను ఎంఎస్‌సీ క్లారా, నార్వేజియన్ యాజమాన్యంలోని స్వాన్ అట్లాంటిక్‌గా గుర్తించారు.

    ఓడ తెలియని వస్తువును ఢీకొట్టిందని, అయితే షిప్ సిబ్బందిలో ఎవరికీ గాయాలు కాలేదని స్వాన్ అట్లాంటిక్ యజమాని తెలిపారు.

    ఎర్ర సముద్రం గుండా వాణిజ్య మార్గాన్ని రక్షించడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడానికి అమెరికా ఇతర దేశాలతో చర్చలు జరుపుతోంది.

    ఇటలీ ఎర్ర సముద్రంలో పెట్రోలింగ్ చేయడానికి నావికా కూటమిలో చేరాలని ఆలోచిస్తోంది.

    ఇరాన్ మద్దతుగల హౌతీలు ఇటీవలి అనేక నౌకలపై దాడి చేశారు. ముఖ్యంగా గాజాలో సైనిక దాడికి నిరసనగా ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌ మిత్ర దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సముద్రం
    తాజా వార్తలు

    తాజా

     Hyderabad: చార్మినార్‌ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి చార్మినార్
    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం
    Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్? సూర్య

    సముద్రం

    UN మహా సముద్రాల ఒప్పందం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    2031లో ISSని పసిఫిక్ మహాసముద్రంలో పడేయనున్న నాసా నాసా
    ముంబై బీచ్‌లో ఘోరం; ఫొటోలు దిగుతుండగా అలలకు కొట్టుకుపోయిన మహిళ  ముంబై
    అందమైన బీచ్‌లు అంటే మీకు ఇష్టమా.. ప్రపంచంలోని ఆహ్లాదకరమైన బీచ్‌లు ఇవే లైఫ్-స్టైల్

    తాజా వార్తలు

    Libya: లిబియా తీరంలో మునిగిన పడవ.. 61 మంది మృతి లిబియా
    PM Modi: పార్లమెంటు భద్రతా లోపంపై మొదటిసారి స్పందించిన మోదీ.. ఏమన్నారంటే?  నరేంద్ర మోదీ
    Chhattisgarh: నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌లో CRPF అధికారి మృతి  ఛత్తీస్‌గఢ్
    Maharashtra: సోలార్ కంపెనీలో పేలుడు.. 9మంది దుర్మరణం  మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025