Page Loader
Cargo Vessels Attack: ఎర్ర సముద్రంలో రెండు కార్గో షిప్‌లపై హౌతీ రెబల్స్ దాడి
Cargo Vessels Attack: ఎర్ర సముద్రంలో రెండు కార్గో షిప్‌లపై హౌతీ రెబల్స్ దాడి

Cargo Vessels Attack: ఎర్ర సముద్రంలో రెండు కార్గో షిప్‌లపై హౌతీ రెబల్స్ దాడి

వ్రాసిన వారు Stalin
Dec 19, 2023
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎర్ర సముద్రంలోని రెండు కార్గో షిప్‌లపై డ్రోన్ దాడులు చేసినట్లు యెమెన్ హౌతీ రెబల్స్ ప్రకటించారు. ఈ దాడి వల్ల ఎర్ర సముద్ర వాణిజ్యానికి అంతరాయం ఏర్పడింది. అనంతరం కార్గో కంపెనీలు తమ షిప్‌లను ఈ ప్రాంతం నుంచి దూరంగా తరలించాయి. నిత్యావసరాలు, ఇంధన సరఫరాలో ఎర్ర సముద్రం చాలా కీలకం. హౌతీ రెబల్స్ దాడుల నేపథ్యంలో ఎర్ర సముద్రం వాణిజ్య రవాణా నిలిచిపోయింది. దీంతో నిత్యావసరాలు, ఇంధన సరఫరా కొరత ఏర్పడి.. ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు, సహజ వాయువు, ఇతర ఇంధన సరఫరాలతో సహా ఎర్ర సముద్రం గుండా అన్ని రవాణాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కార్గో కంపెనీలు ప్రకటించాయి.

ఎర్రసముద్రం

టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడానికి ఇతర దేశాలతో అమెరికా చర్చలు

హౌతీ తిరుగుబాటు దారులు దాడి చేసిన నౌకలను ఎంఎస్‌సీ క్లారా, నార్వేజియన్ యాజమాన్యంలోని స్వాన్ అట్లాంటిక్‌గా గుర్తించారు. ఓడ తెలియని వస్తువును ఢీకొట్టిందని, అయితే షిప్ సిబ్బందిలో ఎవరికీ గాయాలు కాలేదని స్వాన్ అట్లాంటిక్ యజమాని తెలిపారు. ఎర్ర సముద్రం గుండా వాణిజ్య మార్గాన్ని రక్షించడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడానికి అమెరికా ఇతర దేశాలతో చర్చలు జరుపుతోంది. ఇటలీ ఎర్ర సముద్రంలో పెట్రోలింగ్ చేయడానికి నావికా కూటమిలో చేరాలని ఆలోచిస్తోంది. ఇరాన్ మద్దతుగల హౌతీలు ఇటీవలి అనేక నౌకలపై దాడి చేశారు. ముఖ్యంగా గాజాలో సైనిక దాడికి నిరసనగా ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌ మిత్ర దేశాల నౌకలను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు.