Donbas: డాన్బాస్లో ముప్పు.. కీలక నగరాల నుంచి పౌరులు వెళ్లిపోవాలని పోలీసుల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
డాన్బాస్ ప్రాంతంపై పట్టు సాధించేందుకు రష్యా దాడులను ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో.. ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న కీలక నగరాలైన స్లోవియాన్స్క్, క్రామటోర్స్క్ నుంచి పౌరులు బయటకు వెళ్లాలని పోలీసులు సూచించారు. పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఇదే మార్గమని డొనెట్స్క్ పోలీసు అధికారి పావ్లో డయాచెంకో తెలిపారు. పిల్లలున్న కుటుంబాలను తీవ్ర ప్రభావిత ప్రాంతాల నుంచి బలవంతంగా తరలించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. స్లోవియాన్స్క్, క్రామటోర్స్క్, దక్షిణాన ఉన్న కొస్త్యాంటినివ్కా నగరాలు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని 'ఫోర్ట్రెస్ బెల్ట్'గా పిలిచే బలమైన రక్షణ వ్యవస్థలో భాగం. అయితే కొస్త్యాంటినివ్కాలో ఉక్రెయిన్ సైన్యం పరిమిత స్థాయిలోనే ఉందని, దానిపై పూర్తి నియంత్రణ సాధించినట్లు రష్యా ప్రకటించింది.
వివరాలు
దాదాపు 80 శాతం డొనెట్స్క్ రష్యా ఆధీనంలోకి
డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలతో కూడిన డాన్బాస్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవడం రష్యా ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.
ఇప్పటికే లుహాన్స్క్లో దాదాపు మొత్తం, డొనెట్స్క్లో సుమారు 80 శాతం ప్రాంతం రష్యా ఆధీనంలో ఉంది.
క్రామటోర్స్క్,స్లోవియాన్స్క్పై డ్రోన్లు,గ్లైడ్ బాంబులతో దాడులు పెరిగాయి. జూన్లో రెండు నగరాల్లో 70 మంది గాయపడగా.. ఆగస్టులో ఈ సంఖ్య 212కు చేరింది.
జూన్లో 16 మంది, జులైలో 20 మంది, ఆగస్టులో 15 మంది మరణించారు.
ఆగస్టు 25న క్రామటోర్స్క్పై తొమ్మిది గ్లైడ్ బాంబులు పడగా.. అపార్ట్మెంట్లపై దాడుల్లో రెండు నెలల చిన్నారి సహా 24 మంది గాయపడ్డారు.
ఈ ప్రాంతాన్ని కాపాడేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇద్దరు అనుభవజ్ఞులైన జనరల్స్ నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ఫోర్స్లను ఏర్పాటు చేశారు.