NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / కరోనా రోగులతో కిటకిటలాడుతున్న చైనా ఆస్పత్రులు.. ఆ ఒక్క ప్రావిన్స్‌లోనే రోజుకు 10లక్షల కేసులు
    తదుపరి వార్తా కథనం
    కరోనా రోగులతో కిటకిటలాడుతున్న చైనా ఆస్పత్రులు..  ఆ ఒక్క ప్రావిన్స్‌లోనే రోజుకు 10లక్షల కేసులు
    చైనా పట్టణాల్లో విజృంభిస్తున్న కరోనా

    కరోనా రోగులతో కిటకిటలాడుతున్న చైనా ఆస్పత్రులు.. ఆ ఒక్క ప్రావిన్స్‌లోనే రోజుకు 10లక్షల కేసులు

    వ్రాసిన వారు Stalin
    Dec 26, 2022
    12:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒమిక్రాన్ BF.7 వేరియంట్ విజృంభణతో చైనాలో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి . ముఖ్యంగా పట్టణాల్లో అయితే... కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఒక్కో ప్రావిన్స్‌లో లక్షల కొద్ది కేసులు నమోదవుతున్నాయి. షాంఘై సమీపంలోని పెద్ద పారిశ్రామిక ప్రావిన్స్ అయిన ఒక్క జెజియాంగ్‌లోనే రోజుకు 10లక్షలు నమోదవుతుండటం గమనార్హం.

    హెబీలోని ఆస్పత్రులకు కరోనా రోగులు పోటెత్తుతున్నారు. ఆస్పత్రి కారిడార్‌, బెంచీలు, స్లాబులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. బెడ్లు సరిపోక ఆస్పత్రి సిబ్బంది రోగులను తిప్పి పంపుతున్నారు. రోగులకు తగ్గట్టు ఐసీయూలు లేకపోవడంతో... ఆస్పత్రులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో సకాలంలో ఐసీయూలో చేర్పించకపోవడంతో అనేక మంది మృత్యువాత పడుతున్నారు.

    చైనా

    మరణాల్లో చైనా తప్పుడు లెక్కలు..

    ఆక్సిజన్ సరిపడ లేకనే... చైనాలో రోజుకు వేలాది మంది చనిపోతున్నట్లు ప్రపంచ మీడియా కోడై కుస్తోంది. కానీ చైనా మాత్రం ఆ మరణాలను చాలా వరకు తగ్గించి చూపిస్తోంది. చైనాలోని శ్మశానవాటికల వద్ద ఉన్న రద్దీని చూస్తే.. కరోనా మరణాలు భారీ సంఖ్యలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

    ఐసీయూలు, అంబులెన్స్‌లు, ఆక్సిజన్ నిల్వల కొరతల కారణంగానే చైనా భారీ సంఖ్యలో చనిపోతున్నారు. మరిణిస్తున్నవారిలో ఎక్కవగా వృద్ధులే ఉండటం గమనార్హం.

    వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కేసులు, మరణాలను చైనా చాలా‌వరకు తగ్గించి చెబుతోంది. ఇప్పుడు కూడా అదే ధోరణిని అవలంబిస్తోంది.

    చైనాలో పరిమిత రోగనిరోధక శక్తి వల్లే... కేసులు భారీగా పెరుగుతున్నట్లు అంటు వ్యాధి నిపుణుడు డాక్టర్ స్టువర్ట్ కాంప్‌బెల్ రే చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోవిడ్
    ప్రపంచం

    తాజా

    Nambala Kesava Rao: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్ర నేత నంబాల కేశవరావు మృతి  ఛత్తీస్‌గఢ్
    Virat Anushka: పికిల్‌బాల్ కోర్టులో విరాట్, అనుష్క జంట  విరాట్ కోహ్లీ
    Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 410 పాయింట్లు, నిఫ్టీ 129 పాయింట్లు  స్టాక్ మార్కెట్
    MI vs DC: ఒకే స్థానం.. రెండు జట్లు.. వాంఖడేలో సమరం షూరు! ముంబయి ఇండియన్స్

    కోవిడ్

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం భారతదేశం
    కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం భారతదేశం
    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ భారతదేశం
    భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే.. భారతదేశం

    ప్రపంచం

    T 20 సారిథిగా హార్థిక్ పాండ్యా..! క్రికెట్
    కుల్దీప్‌ను పక్కన పెట్టడం.. నమ్మశక్యంగా లేదు : గవాస్కర్‌ క్రికెట్
    మినీ ఐపీఎల్ వేలంలో రికార్డులు బద్దలవుతాయా..? క్రికెట్
    సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌‌ విడుదలకు కారణం అదేనట! అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025