LOADING...
Iran: '47 ఏళ్లుగా చచ్చిపోయినట్టే'.. ఇరాన్‌లో రక్తమోడిన వృద్ధ మహిళ నిరసన వైరల్ 
'47 ఏళ్లుగా చచ్చిపోయినట్టే'.. ఇరాన్‌లో రక్తమోడిన వృద్ధ మహిళ నిరసన వైరల్

Iran: '47 ఏళ్లుగా చచ్చిపోయినట్టే'.. ఇరాన్‌లో రక్తమోడిన వృద్ధ మహిళ నిరసన వైరల్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2026
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌ ప్రస్తుతం గత కొన్నేళ్లలోనే అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్నాయి. రెండో వారం కూడా కొనసాగుతున్న ఈ నిరసనల నేపథ్యంలో, ముఖం నిండా రక్తపు మచ్చలతో ఉన్న ఓ వృద్ధ ఇరానీ మహిళ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పశ్చిమ ఇరాన్‌లోని లోరెస్టాన్‌ ప్రావిన్స్‌ బోరుజెర్డ్‌ పట్టణంలో జరిగిన ఆందోళనల్లో, ఇస్లామిక్‌ పాలనకు సవాల్‌ విసురుతూ ఆ మహిళ "నాకు భయం లేదు... నేను 47 ఏళ్లుగా చచ్చిపోయినట్టే" అంటూ నినాదాలు చేస్తూ కనిపించింది. 1979లో జరిగిన ఇరాన్‌ ఇస్లామిక్‌ విప్లవం నాటి నుంచి తమ జీవితం ఎలా మారిందో ఆమె మాటల్లో ఆవేదనగా వ్యక్తమైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 వైరల్‌గా మారిన ఇరానీ మహిళ వీడియో

వివరాలు 

నాకు భయం లేదు… 47 ఏళ్లుగా చచ్చిపోయినట్టే

టెహ్రాన్‌లో రాత్రి సమయంలో జరిగిన ఈ నిరసనల వీడియోను ఇరానీ కార్యకర్త, జర్నలిస్టు మసీహ్‌ అలినెజాద్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 1979 నుంచి ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ పాలనలో జీవిస్తూ అలసిపోయిన ప్రజల భావోద్వేగాలకు ఇది నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. "నాకు భయం లేదు... 47 ఏళ్లుగా చచ్చిపోయినట్టే" అంటూ ఆ వృద్ధ మహిళ చెప్పిన మాటలను ఉదహరిస్తూ అలినెజాద్‌ స్పందించారు. "ఇది ఇరాన్‌లో ఇస్లామిక్‌ రిపబ్లిక్‌తో విసిగిపోయిన ఓ మహిళ గొంతు. 47 ఏళ్ల క్రితం ఇస్లామిక్‌ పాలన మా హక్కులను తీసేసి, ఓ దేశాన్ని బందీలుగా మార్చింది. ఇప్పుడు ప్రజలకు కోల్పోయేదేమీ లేదు. అందుకే లేచి నిలబడుతున్నారు. ఇరాన్‌ లేస్తోంది" అని ఆమె ట్వీట్‌ చేశారు.

Advertisement

వివరాలు 

ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా  దుకాణాలు మూసివేయడంతో మొదలైన  ఆందోళనలు 

ధరల పెరుగుదల, కరెన్సీ విలువ భారీగా పడిపోవడం వంటి కారణాలతో మొదలైన ఈ నిరసనలు, ఇప్పుడు అనేక ప్రావిన్సులకు విస్తరించాయి. ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్లో ఉన్న లోతైన సమస్యలను ఇవి బయటపెడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. డిసెంబర్‌ 28న టెహ్రాన్‌ గ్రాండ్‌ బజార్‌ వ్యాపారులు ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా దుకాణాలు మూసివేయడంతో ఈ ఆందోళనలు మొదలయ్యాయి. అప్పటి నుంచి పశ్చిమ, మధ్య ఇరాన్‌లో ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని మానవ హక్కుల సంఘాలు, ఆన్‌లైన్‌ మానిటర్లు వెల్లడించాయి.

Advertisement

వివరాలు 

అల్లర్లు మొదలైన కొద్దిసేపటికే ఇంటర్నెట్‌,ఫోన్‌ సేవలను నిలిపేసిన ప్రభుత్వం 

ఇక, దేశం విడిచి వెళ్లిన క్రౌన్‌ ప్రిన్స్‌ భారీ నిరసనలకు పిలుపునివ్వడంతో టెహ్రాన్‌లో ప్రజలు వీధుల్లోకి వచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కొందరు తమ ఇళ్ల నుంచే నినాదాలు చేశారు. అల్లర్లు మొదలైన కొద్దిసేపటికే ఇంటర్నెట్‌, ఫోన్‌ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. ఇదిలా ఉండగా, ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియన్‌ భద్రతా బలగాలకు "అత్యంత సంయమనం పాటించాలి" అంటూ పిలుపునిచ్చారు. శాంతియుతంగా వ్యవహరించాలని, హింసను నివారించాలని ఆయన పిలుపునిచ్చారు. పెరుగుతున్న జీవన వ్యయంపై ఉపశమనం కోరుతూ నిరసనలకు దిగుతున్న ప్రజలతో చర్చలు జరపాలని ఆయన అన్నారు.

Advertisement