LOADING...
Indonesia: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు.. 16 మంది మృతి
ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు.. 16 మంది మృతి

Indonesia: ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు.. 16 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 07, 2026
08:34 am

ఈ వార్తాకథనం ఏంటి

కుండపోతగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్సులో ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు కనీసం 16 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున నదులు ఒక్కసారిగా ఉప్పొంగడంతో సియావు-తగులాండాంగ్-బియారో జిల్లాలో బురద, రాళ్లు, శిథిలాలతో కూడిన వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించి పలు గ్రామాలను ముంచెత్తింది. ఈ విపత్తు తీవ్రతతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి తెలిపారు.

వివరాలు 

పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్న 140కు పైగా ఇళ్లు

ఈ వరదల్లో 140కు పైగా ఇళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో సుమారు 680 మందిని సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. వరదల వల్ల రహదారులు, సమాచార వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడంతో సహాయక చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బాధితులకు త్వరితగతిన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సితారో జిల్లాలో సోమవారం నుంచి 14 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని అమల్లోకి తీసుకొచ్చినట్లు అధికారులు ప్రకటించారు.

Advertisement