Loading...
Philippines: 'కాస్త సిగ్గుండాలి'.. ప్రసంగం మధ్యలో చైనా నోట్‌పై ఫిలిప్పీన్స్ మంత్రి ఫైర్
'కాస్త సిగ్గుండాలి'.. ప్రసంగం మధ్యలో చైనా నోట్‌పై ఫిలిప్పీన్స్ మంత్రి ఫైర్

Philippines: 'కాస్త సిగ్గుండాలి'.. ప్రసంగం మధ్యలో చైనా నోట్‌పై ఫిలిప్పీన్స్ మంత్రి ఫైర్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2026
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ కొరియాలో జరిగిన సియోల్ డిఫెన్స్ డైలాగ్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. చైనా అనుసరిస్తున్న దూకుడు దౌత్య విధానానికి ఫిలిప్పీన్స్ గట్టి సమాధానం ఇచ్చింది. చైనా నేతలు అనుసరించే దూకుడు, ఘర్షణాత్మక విదేశాంగ విధానాన్నే 'వోల్ఫ్ వారియర్ డిప్లొమసీ'గా పిలుస్తారు. సోమవారం దక్షిణ కొరియాలోని ప్రముఖ బహుపాక్షిక భద్రతా సదస్సులో ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి గిల్బెర్టో టియోడోరో ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రేక్షకుల మధ్య ఉన్న సియోల్‌లోని చైనా రాయబార కార్యాలయానికి చెందిన సైనిక అధికారి ఒక నోట్‌ను టియోడోరోకు పంపించారు.Embed

వివరాలు 

దక్షిణ చైనా సముద్రంపై చైనా వైఖరిని స్పష్టం చేసిన నోట్

ఆ నోట్‌లో దక్షిణ చైనా సముద్రంపై తమ వైఖరిని చైనా మరోసారి స్పష్టం చేసిందని టియోడోరో తెలిపారు.

వివాదాస్పద జలాల్లో కొంత భాగంపై ఫిలిప్పీన్స్‌కు హక్కులు ఉన్నాయని గుర్తించిన ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం (UNCLOS) తీర్పును చైనా అంగీకరించదని, గుర్తించదని అందులో పేర్కొన్నట్లు చెప్పారు.

ఆ తీర్పును చైనా 'చెల్లనిది, అమలులో లేనిది'గా కొట్టిపారేసినా.. UNCLOS ప్రకారం అది తుది నిర్ణయం, చట్టబద్ధంగా అమలు చేయాల్సిన తీర్పు.

టియోడోరో తన ప్రసంగాన్ని ఆపకుండా నోట్‌లోని ప్రతి అంశాన్ని ఒక్కొక్కటిగా చదివి, వాటికి వేదికపైనే తన వాదనలతో సమాధానం ఇచ్చారు.

వివరాలు 

చైనా నోట్‌పై టియోడోరో ఘాటు స్పందన

''నా దగ్గర ఒక నోట్ ఉంది. ఇది చైనా నుంచి వచ్చినట్లు అనిపిస్తోంది'' అంటూ టియోడోరో ప్రసంగంలోనే దాన్ని చదవడం ప్రారంభించారు.

అందులోని ప్రతి అంశానికి వరుసగా సమాధానం ఇచ్చారు.

అనంతరం తన ప్రసంగాన్ని ప్రభావితం చేసేందుకు చైనా ప్రయత్నిస్తోందంటూ తీవ్రంగా విమర్శించారు.

''ఇది ఇక గ్రే జోన్ వ్యవహారం కాదు. ఇది నిజమైన బలవంతం, బెదిరింపు, దూకుడు చర్య'' అని దక్షిణ కొరియా, చెక్ రిపబ్లిక్ రక్షణ మంత్రుల సమక్షంలో వ్యాఖ్యానించారు. ''చైనా కనీస మర్యాద, పద్ధతులు పాటించాలి'' అని అన్నారు.

దీనికి సభలో ఉన్నవారు చప్పట్లతో స్పందించారు. చివరగా ''కాస్త సిగ్గుండాలి'' అంటూ చైనాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

ఫిలిప్పీన్స్ ప్రతినిధుల నోట్ అనుకున్న సిబ్బంది

దక్షిణ కొరియా వార్తా సంస్థ యోన్‌హాప్‌ ప్రకారం.. ఈ నోట్‌ను సియోల్‌లోని చైనా రాయబార కార్యాలయంలో పనిచేసే ఓ సైనిక అధికారి పంపించారు.

అయితే కార్యక్రమ నిర్వాహక సిబ్బంది దాన్ని ఫిలిప్పీన్స్ ప్రతినిధి బృందం పంపిన సమాచార పత్రంగా పొరబడ్డారు.

దీంతో టియోడోరో వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో ఆ నోట్‌ను ఆయనకు అందించారు.

దక్షిణ చైనా సముద్రంలో చైనా చర్యలను టియోడోరో తరచూ బహిరంగంగా విమర్శిస్తుంటారు. ఆయనపై చైనా ఇప్పటికే ఆంక్షలు కూడా విధించింది.

ADVERTISEMENT

వివరాలు 

చైనా-ఫిలిప్పీన్స్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు

దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా, ఫిలిప్పీన్స్ మధ్య చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది.

అక్కడి రీఫ్‌లు, సముద్రపు దిబ్బలపై ఇరుదేశాల మధ్య తరచూ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ ఏడాది పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి.

చైనా కోస్ట్‌గార్డ్ నౌకలు ఫిలిప్పీన్స్‌కు చెందిన నౌకలను అడ్డుకోవడంతో పాటు వాటిపై నీటి ఫిరంగులతో దాడులు చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

మరో ఘటనలో చైనా సిబ్బంది చెక్క దండతో కొట్టినట్లు ఆరోపణలు రావడంతో ఓ ఫిలిప్పీన్స్ నావికుడు గాయపడ్డాడు.

దీంతో ఇరుదేశాల మధ్య దక్షిణ చైనా సముద్ర వివాదం మరింత సున్నితంగా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చైనాపై ఫిలిప్పీన్స్ ఫైర్

ADVERTISEMENT