Indonesia: ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఎనిమిది మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ కాళీమంతన్ ప్రావిన్స్లో హెలికాప్టర్ కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించి శకలాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. అధికారుల వివరాల ప్రకారం, ఎయిర్ బస్ హెచ్-130 హెలికాప్టర్ గురువారం మెల్వాయ్ ప్రాంతం నుంచి ఎగిరిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ కేంద్రంతో సంబంధాలు కోల్పోయింది. అనంతరం ఓ కొండపై ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ సంకేతాలు కనిపించకుండా పోయాయి.
వివరాలు
మూడు కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ తోక భాగం
టేకాఫ్ జరిగిన ప్రాంతానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో రక్షణ బృందాలు హెలికాప్టర్ తోక భాగాన్ని గుర్తించాయి. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. సైనిక దళాలు, సహాయక బృందాలు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం పామ్ ఆయిల్ కంపెనీకి చెందినదని, ఈ హెలికాప్టర్ మాథ్యూ ఎయిర్ నుసంతారాకు చెందినదిగా అధికారులు వెల్లడించారు.