NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / 945రోజుల తర్వాత మాస్క్ ఆంక్షలకు ముగింపు పలికిన హాంకాంగ్‌
    తదుపరి వార్తా కథనం
    945రోజుల తర్వాత మాస్క్ ఆంక్షలకు ముగింపు పలికిన హాంకాంగ్‌
    945రోజుల తర్వాత మాస్క్ ఆంక్షల తొలగింపు

    945రోజుల తర్వాత మాస్క్ ఆంక్షలకు ముగింపు పలికిన హాంకాంగ్‌

    వ్రాసిన వారు Stalin
    Feb 28, 2023
    11:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కరోనా ఆంక్షల నుంచి బంధ విముక్తులవుతున్నాయి. సుదీర్ఘ కరోనా కాలానికి ఇక ముగింపు పలికేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో తమ దేశంలో సుదీర్ఘ కాలంగా అమలు చేస్తున్న మాస్క్ ఆంక్షలను తొలగిస్తున్నట్లు హాంకాంగ్‌ ప్రకటించింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

    ఇకపై బహిరంగ ప్రదేశాలు, ప్రజా రవాణాలో ఎక్కడా కూడా మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని హాంకాంగ్ నాయకుడు జాన్ లీ పేర్కొన్నారు.

    హాంకాంగ్‌ను ఫైనాన్స్ హబ్‌ను పునరుద్ధరించడానికి ప్రభుత్వం పర్యాటకులు, విదేశీ కార్మికులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నందున ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.

    హాంకాంగ్

    మార్చిలో హాంకాంగ్‌లో అంతర్జాతీయ ఈవెంట్ల నిర్వహణ

    వచ్చే నెలలో హాంకాంగ్ అతిపెద్ద అంతర్జాతీయ ఈవెంట్‌లను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో వరుసగా కరోనా ఆంక్షలను తొలగిస్తూ వస్తోంది. అందుకే మాస్క్‌ను తొలగించడానికి సమయం ఆసన్నమైందని లీ పేర్కొన్నారు.

    హాంకాంగ్‌లో జూలై 29, 2020 నుంచి ప్రజలు ఆరుబయట సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలను విధించింది.

    ఈ భూమిపై ప్రస్తుతం మాస్క్‌ ధరించడాన్ని తప్పసరి చేసి అమలు చేస్తున్న ఏకైక దేశం హాంకాంగ్ కావడం గమనార్హం. బుధవారంతో అంటే 945రోజుల తర్వాత మాస్క్ ఆంక్షలను ప్రభుత్వం తొలగిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హాంగ్ కాంగ్
    కోవిడ్
    కరోనా కొత్త మార్గదర్శకాలు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    హాంగ్ కాంగ్

    పెట్టుబడిదారుల కోసం ఆసియాలో రోడ్‌షో నిర్వహించనున్న అదానీ గ్రూప్ అదానీ గ్రూప్

    కోవిడ్

    మళ్లీ కరోనా భయాలు.. పాజిటివ్ కేసులపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం భారతదేశం
    కరోనా కథ ముగిసిపోలేదు.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధం: కేంద్రం భారతదేశం
    'భారత్ జూడో యాత్ర'కు కరోనా షాక్.. రాహుల్‌కు కేంద్రం లేఖ భారతదేశం
    భారత్‌లో జూలైలోనే బయటపడ్డ కరోనా 'BF.7'.. భయమంతా రీఇన్ఫెక్షన్‌తోనే.. భారతదేశం

    కరోనా కొత్త మార్గదర్శకాలు

    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం మన్‌సుఖ్ మాండవీయ
    ఆ ఆరు దేశాల మీదుగా ప్రయాణిస్తున్నారా ? అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి దక్షిణ కొరియా
    ప్రయాణ ఆంక్షలను తప్పుపట్టిన చైనా.. ప్రజల ఆరోగ్యం కోసం తప్పదని చెప్పిన అమెరికా చైనా
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025