NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / 'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్
    తదుపరి వార్తా కథనం
    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్
    పాక్, చైనాకు గట్టి కౌంటర్

    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్

    వ్రాసిన వారు Stalin
    Dec 31, 2022
    10:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏ చిన్న అవకాశం వచ్చినా.. పాక్, చైనాపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తనదైన శైలిలో రెచ్చిపోతున్నారు. తాజాగా సైప్రస్‌లోని ప్రవాస భారతీయలను ఊద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్, చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

    పొగురు దేశాలతో భారత్ మంచి సంబంధాలను కోరుకుంటోందని చెప్పారు ఎస్.జైశంకర్. అలాగని ఉగ్రవాదాన్ని అంగీకరించే ఉద్దేశం తమకు లేదని పరోక్షంగా పాకిస్థాన్‌పై సెటైర్ వేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదం కారణంగా భారత్ బాధపడినంతగా.. ఏ దేశం బాధపడలేదన్నారు. అయితే తాము ఎప్పటికీ ఉగ్రవాదాన్ని బలవంతంగా చర్చకు తీసుకురాబోమన్నారు.

    జైశంకర్

    'ఎల్ఏసీని ఏకపక్షంగా మారిస్తే ఉపేక్షించబోం'

    చైనాపై కూడా తనదైన శైలిలలో స్పందించారు జైశంకర్. కరోనా కాలం నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణంగా లేవన్నారు. వాస్తవ నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చే ప్రయత్నాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమన్నారు. ప్రస్తుతం భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, ప్రపంచంలోని సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపిస్తోందన్నారు జైశంకర్.

    డిసెంబర్ 9న తవాంగ్ సెక్టార్‌లోని ఎల్ఏసీ వద్ద భారత్, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. అనంతరం ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగిగా అవి ఎలాంటి పరిష్కారాన్ని కనుగొనలేదు. 2020 తర్వాత ఇరు దేశాల సైన్యాల మధ్య జరిగిన మొదటి సరిహద్దు ఘర్షణ ఇదే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్
    చైనా
    విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

    తాజా

    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ
    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్
    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్

    పాకిస్థాన్

    రమీజ్ భాయ్‌కు 4,5 సార్లు మెసేజ్ చేసినా.. రిప్లే ఇవ్వలేదు : పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ప్రపంచం

    చైనా

    శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్ ఆటో మొబైల్
    చైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్ ఆండ్రాయిడ్ ఫోన్
    కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు కోవిడ్

    విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

    మాల్దీవుల్లో భారత హైకమిషన్‌పై దాడికి కుట్ర.. స్పందించిన విదేశాంగ శాఖ మాల్దీవులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025