NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Turkey: తుర్కియే సంస్థపై భారత్‌ ప్రతీకారం.. 10శాతానికి పతనమైన సెలెబీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Turkey: తుర్కియే సంస్థపై భారత్‌ ప్రతీకారం.. 10శాతానికి పతనమైన సెలెబీ
    తుర్కియే సంస్థపై భారత్‌ ప్రతీకారం.. 10శాతానికి పతనమైన సెలెబీ

    Turkey: తుర్కియే సంస్థపై భారత్‌ ప్రతీకారం.. 10శాతానికి పతనమైన సెలెబీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 16, 2025
    05:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తుర్కియేతో సంబంధాలపై వివాదం వెల్లువెత్తడంతో, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సెలెబీ కంపెనీపై తీవ్ర ప్రభావం చూపింది.

    మే 16న ఇస్తాంబుల్‌ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో సెలెబీ షేర్‌ ధర ఏకంగా 10 శాతం పడిపోయింది. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్‌ మొత్తం 30 శాతానికి పతనమైంది.

    భారత్‌లో సెలెబీ సబ్సిడరీ సంస్థ గుండా విమానాశ్రయాల్లో సరకుల రవాణా సహా పలు సేవలను ఇప్పటివరకు అందిస్తోంది.

    అయితే, ఇటీవల జరిగిన 'ఆపరేషన్‌ సిందూర్' సమయంలో తుర్కియే ప్రభుత్వం పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడడమే కాకుండా, తమ సైనికులను అక్కడకు పంపడం భారత ప్రభుత్వాన్ని ఆగ్రహానికి గురిచేసింది.

    Details

    ఒప్పందాన్ని రద్దు చేసుకున్న అదానీ గ్రూప్

    దాంతో సెలెబీకి ఉన్న అన్ని సెక్యూరిటీ క్లియరెన్స్‌లు రద్దు చేయడంతోపాటు, దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల నుంచి సంస్థ కార్యకలాపాలను తొలగించేందుకు చర్యలు మొదలయ్యాయి.

    అదానీ గ్రూప్‌కు చెందిన ఎయిర్‌పోర్ట్స్ మేనేజ్‌మెంట్ సంస్థ కూడా సెలెబీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో ముంబయి, అహ్మదాబాద్ విమానాశ్రయాల్లో ఆ సంస్థ కార్యకలాపాలు ముగిశాయి.

    ఈ రెండు విమానాశ్రయాల ప్రతినిధులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

    అదానీ గ్రూప్ ప్రస్తుతం ముంబయి, అహ్మదాబాద్‌, మంగళూరు, గువహాటి, జైపూర్‌, లఖ్‌నవూ, తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్స్‌ను నిర్వహిస్తోంది.

    Details

    ఎర్డోగాన్ కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధం లేదు

    అంతేకాకుండా దిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) కూడా సెలెబీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసింది.

    భవిష్యత్తులో AISATS, బర్డ్ గ్రూప్ సంస్థలతో కలిసి పని చేయనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో, తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ సెలెబీ సంస్థ ఓ వివరణ విడుదల చేసింది.

    తాము తుర్కియే కంపెనీ కాదని, ఎర్డోగాన్ కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన కుమార్తె సుమెయ్యి ఎర్డోగాన్ తమ కంపెనీని నియంత్రిస్తుందనే ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. మా మాతృసంస్థలో ఆమెకు గానీ, ఆమె పేరుతో ఉన్న ఎవరికీ గానీ హక్కులు లేదా వాటాలు లేవని తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచం

    తాజా

    Ponguru Narayana: రెవెన్యూ రికార్డుల అమలు,భూవివాదాల పరిష్కారానికి నక్షా కార్యక్రమం: నారాయణ  ఆంధ్రప్రదేశ్
    Turkey: తుర్కియే సంస్థపై భారత్‌ ప్రతీకారం.. 10శాతానికి పతనమైన సెలెబీ ప్రపంచం
    Kannappa: 'కన్నప్ప' ఫైనల్ చాప్టర్.. కామిక్ బుక్ చివరి అధ్యాయం రిలీజ్ కన్నప్ప
    Trump pakistan deal : పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్‌తో అమెరికా ఒప్పందం.. ట్రంప్ ఫ్యామిలీ,పాక్ ఆర్మీ చీఫ్‌కి లింకులు! అమెరికా

    ప్రపంచం

    Earthquake: పపువా న్యూ గినియాలో 6.9 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ భూకంపం
    Jaguar Land Rover: జాగ్వార్ ల్యాండ్ రోవర్ కీలక నిర్ణయం.. అమెరికాలో ఎగుమతులకు బ్రేక్‌  అమెరికా
    US: ఆఫ్రికా దేశాలకు అమెరికా హెచ్చరిక.. వలసదారుల కోసం వీసాల నిలిపివేత అమెరికా
    Dominican: డొమినికన్ విషాదం.. నైట్‌క్లబ్ పైకప్పు కూలిన ఘటనలో 184 మంది మృతి డొమినికన్ రిపబ్లిక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025