Loading...
Indonesia : ఇండోనేషియా రాజధానిలో విమానాల పునరుద్ధరణ
ఇండోనేషియా రాజధానిలో విమానాల పునరుద్ధరణ

Indonesia : ఇండోనేషియా రాజధానిలో విమానాల పునరుద్ధరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2026
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనక్ క్రాకటౌ అగ్నిపర్వతంలో కార్యకలాపాలు పెరగడంతో వెలువడిన బూడిద విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగించింది. బూడిద మేఘాలు వ్యాపించడంతో పలు విమానాశ్రయాలను రెండు రోజులపాటు మూసివేయాల్సి వచ్చింది. దీంతో దాదాపు 3 వేల విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి. లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితులు కొంత మెరుగుపడటంతో మంగళవారం జకార్తాకు వెళ్లే,అక్కడి నుంచి బయలుదేరే విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇండోనేషియా రాజధాని జకార్తాకు ప్రధానంగా సేవలందించే సుకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయం, హలీమ్ పెర్దానాకుసుమా విమానాశ్రయాలను అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే తిరిగి తెరిచినట్లు రవాణా శాఖ మంత్రి దూదీ పుర్వగంధీ వెల్లడించారు. విమానాశ్రయాలపై అగ్నిపర్వత బూడిద ప్రభావాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.ఇదే సమయంలో బండంగ్,బాంటెన్ ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లోనూ కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయి.

వివరాలు 

అనూహ్యంగా మారుతున్న గాలి దిశ

పశ్చిమ జావాలోని బండంగ్‌లో ఉన్న హుసేన్ సస్త్రనేగర విమానాశ్రయం,బాంటెన్ ప్రావిన్స్‌లోని రెండు చిన్న విమానాశ్రయాలు కూడా మంగళవారం అర్ధరాత్రి తర్వాత తిరిగి తెరుచుకున్నాయి.

అయితే బూడిద ముప్పు పూర్తిగా తొలగిందని నిర్ధారించుకునే వరకు అన్ని విమానాశ్రయాల్లో కార్యకలాపాలను ఒకేసారి పునరుద్ధరించలేదు.

అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ..విమానయాన మార్గాల్లోకి అగ్నిపర్వత బూడిద చేరే అవకాశాన్ని అంచనా వేస్తున్నారు.

ఈకారణంగా మూడు విమానాశ్రయాలను స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10గంటల వరకు మూసి ఉంచారు.

సుమత్రాద్వీపం దక్షిణ అంచున ఉన్న లాంపుంగ్‌లోని రాడిన్ ఇంటెన్ II విమానాశ్రయం కూడా తాత్కాలికంగా మూసివేసిన వాటిలో ఉంది.

మరోవైపు దక్షిణ సుమత్రాలోని పగర్ ఆలం ప్రాంతంలోని అటుంగ్ బుంగ్సు విమానాశ్రయం సోమవారం ఉదయానికే సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.

వివరాలు 

బూడిద ముప్పుపై అప్రమత్తంగా..

అనక్ క్రాకటౌ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలి దిశ తరచూ మారుతుండటంతో విమానాశ్రయాలను తెరవడంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

పరిస్థితులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి దూదీ పుర్వగంధీ తెలిపారు.

విమానాశ్రయాల పరిసరాల నుంచి అగ్నిపర్వత బూడిద తొలగిపోయిందని నిర్ధారించుకోవడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

పలు విమానాశ్రయాల్లో నిర్వహించిన తనిఖీల్లో బూడిద ఆనవాళ్లు కనిపించకపోయినా.. పరిశీలన, శుభ్రపరిచే పనులకు తగిన సమయం ఇవ్వడం కోసం కొన్ని విమానాశ్రయాలను మరికొంతసేపు మూసి ఉంచారు.

ADVERTISEMENT

వివరాలు 

బూడిద ముప్పుపై అప్రమత్తంగా..

సాధారణ విమాన కార్యకలాపాలను ప్రారంభించే ముందు రన్‌వేలు, టాక్సీవేలు, విమానాలను కూడా పూర్తిగా తనిఖీ చేయాల్సి ఉంది.

విమాన భద్రతకు అగ్నిపర్వత బూడిద పెద్ద సవాలు. బూడిద మేఘాలు విమానాల కార్యకలాపాలతో పాటు విమానాశ్రయాల మౌలిక సదుపాయాలపైనా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

అందుకే పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నప్పటికీ.. ఎక్కడైనా ప్రమాదం ఉండొచ్చని భావించిన అధికారులు కొన్ని విమానాశ్రయాలను కొనసాగింపుగా మూసి ఉంచారు.

ADVERTISEMENT

వివరాలు 

2,961 విమాన సర్వీసులకు అంతరాయం

ఆదివారం, సోమవారం రెండు రోజులపాటు విమానాశ్రయాల మూసివేతతో ఇండోనేషియాలో విమాన ప్రయాణ వ్యవస్థకు గణనీయమైన అంతరాయం ఏర్పడింది.

అధికారుల గణాంకాల ప్రకారం ఈ సమయంలో మొత్తం 2,961 విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి.

వీటిలో 622 అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి. ఈ పరిణామంతో సుమారు 3.41 లక్షల మంది ప్రయాణికుల ప్రయాణాలపై ప్రభావం పడింది.

ముఖ్యంగా అగ్నిపర్వత బూడిద మేఘాలు విమానాశ్రయాలు, విమాన మార్గాల వైపు వ్యాపించినప్పుడు.. అగ్నిపర్వత కార్యకలాపాలు విమాన రాకపోకలపై ఎంతటి ప్రభావం చూపగలవో తాజా పరిణామాలు స్పష్టం చేశాయి.

ADVERTISEMENT