NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Pakistan: బలూచిస్థాన్‌లోని క్వెట్టా విమానాశ్రయంలో కాల్పులు.. జమియాత్ నాయకుడు ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్ మృతి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pakistan: బలూచిస్థాన్‌లోని క్వెట్టా విమానాశ్రయంలో కాల్పులు.. జమియాత్ నాయకుడు ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్ మృతి
    బలూచిస్థాన్‌లోని జమియాత్ నాయకుడు ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్ మృతి

    Pakistan: బలూచిస్థాన్‌లోని క్వెట్టా విమానాశ్రయంలో కాల్పులు.. జమియాత్ నాయకుడు ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్ మృతి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 17, 2025
    10:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉంది. రైలు హైజాక్, సైనిక శిబిరంపై దాడి తర్వాత, ఆదివారం రాత్రి బలూచిస్థాన్‌లోని క్వెట్టా విమానాశ్రయంలో కాల్పులు జరిగాయి.

    జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (JUI) సీనియర్ నాయకుడు ముఫ్తీ అబ్దుల్ బాకీ నూర్జాయ్ గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో మరణించారు.

    ఈ కాల్పుల్లో నూర్జాయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.

    వివరాలు 

    జమియాత్ నాయకుడు నూర్జాయ్ ఎవరు? 

    నూర్జాయ్ ఈ ప్రాంతంలోని ప్రసిద్ధ ఇస్లామిక్ పండితుడిగా పరిగణించబడ్డాడు. JUI సీనియర్ నాయకులలో ఆయన కూడా ఉన్నారు. నెల రోజుల్లో ఓ ప్రముఖ నేత హత్యకు గురికావడం ఇది మూడోసారి.

    కొద్ది రోజుల క్రితం, మార్చి 9న బలూచిస్తాన్‌లోని టర్బత్ నగరంలో ముఫ్తీ షా మీర్‌ను ముష్కరులు హతమార్చారు. మసీదు వెలుపల అతనిపై కాల్పులు జరిపారు.

    అంతకు ముందు ఫిబ్రవరి 28న ఖైబర్ పఖ్తుంఖ్వాలోని నౌషేరా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో తాలిబాన్ మద్దతుదారు మౌలానా హమీదుల్ హక్ హక్కానీ మరణించాడు.

    వివరాలు 

    బలూచిస్థాన్,ఖైబర్ పఖ్తుంక్వాలో పెరిగిన హింస 

    పాకిస్థాన్‌లోని సమస్యాత్మకమైన బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో నిరంతరం హింస ప్రజ్జ్వరిల్లుతోంది.

    బలూచిస్థాన్‌లో, రైలును హైజాక్ చేసిన తరువాత మార్చి 16న నోష్కీలో పాకిస్తాన్ సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై బలూచ్ యోధులు దాడి చేశారు. 90 మంది జవాన్లు మృతి చెందినట్లు సమాచారం.

    గతంలో ఖైబర్ ఫక్తున్ఖ్వాలో, ట్యాంక్ జిల్లాలోని జండోలాలో పాకిస్తాన్ సైనిక శిబిరంపై తాలిబాన్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పాకిస్థాన్

    తాజా

    Exams: భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో .. నేటి నుంచి జరగాల్సిన పరీక్షలు రద్దు పరీక్షలు
    Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్‌.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు జమ్ముకశ్మీర్
    AP Liquor Scam: మద్యం కుంభకోణం.. రూ.3,200 కోట్ల దందాపై ఈడీ కేసు నమోదు! ఆంధ్రప్రదేశ్
    Operation Sindoor: పాకిస్థాన్ డ్రోన్లు కూల్చేశాం: భారత ఆర్మీ పోస్టు ఆపరేషన్‌ సిందూర్‌

    పాకిస్థాన్

    China: హిందూ మహాసముద్రం భద్రతపై ఆందోళన పెరిగిన వేళ.. పాక్ తో కలిసి నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న చైనా చైనా
    South africa: అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఘటన.. ఫీల్డింగ్ కోచ్‌ను బరిలోకి దించిన సౌతాఫ్రికా సౌత్ ఆఫ్రికా
    Poonch Border : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్.. భారత సైన్యం ధీటైన సమాధానం భారత సైన్యం
    Champions Trophy: వివాదానికి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ముగింపు.. ఆ స్టేడియంలో భారత జెండా ఛాంపియన్స్ ట్రోఫీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025