LOADING...
India raps Pakistan: ఐరాసలో కశ్మీర్‌ ప్రస్తావనతో పాక్‌ రాజకీయం.. తిప్పికొట్టిన భారత్
ఐరాసలో కశ్మీర్‌ ప్రస్తావనతో పాక్‌ రాజకీయం.. తిప్పికొట్టిన భారత్

India raps Pakistan: ఐరాసలో కశ్మీర్‌ ప్రస్తావనతో పాక్‌ రాజకీయం.. తిప్పికొట్టిన భారత్

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2026
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌కు భారత్ తీవ్ర స్థాయిలో సమాధానం ఇచ్చింది. సామూహిక హత్యలు, హింసాత్మక చర్యలకు చరిత్ర కలిగిన దేశం భారత్ అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని మండిపడింది. 'సాయుధ ఘర్షణల్లో పౌరుల రక్షణ' అంశంపై జరిగిన సమావేశాన్ని పాకిస్థాన్ రాజకీయ వేదికగా మార్చేందుకు ప్రయత్నించగా భారత్ గట్టిగా తిప్పికొట్టింది. భద్రతా మండలిలో మాట్లాడిన పాకిస్థాన్ ప్రతినిధి కావాలనే జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. అంతర్జాతీయ నిబంధనలు, మానవతా విలువల పేరుతో భారత్‌పై విమర్శలు చేయడానికి యత్నించారు. సాయుధ ఘర్షణల చర్చను అడ్డం పెట్టుకుని భారత అంతర్గత వ్యవహారాలను ప్రపంచం ముందుకు తీసుకురావాలని ప్రయత్నించారు.

వివరాలు 

కాబూల్‌ ఆసుపత్రి దాడిని గుర్తుచేసి చురకలు

ఈ వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని తీవ్రంగా స్పందించారు. తమ దేశంలో జరుగుతున్న వైఫల్యాలను దాచిపెట్టేందుకు పాకిస్థాన్ ఇతర దేశాలపై హింసను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. జమ్మూ కశ్మీర్ పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, ఆ విషయంలో పాకిస్థాన్ జోక్యం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చిలో రంజాన్ సందర్భంగా ఆఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ గుర్తు చేసింది. కాబూల్‌లోని ఒక ఆసుపత్రిపై జరిగిన దాడిలో 269 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ప్రార్థనలు ముగించుకుని వెళ్తున్న అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం పాకిస్థాన్ అమానుష వైఖరికి నిదర్శనమని విమర్శించింది.

వివరాలు 

1971 నాటి నరమేధాన్నీ ప్రస్తావించిన భారత్

అలాగే 1971లో 'ఆపరేషన్ సెర్చ్‌లైట్' పేరుతో పాకిస్థాన్ సైన్యం సొంత ప్రజలపైనే దారుణ అణచివేతకు పాల్పడిందని భారత్ గుర్తు చేసింది. లక్షలాది మంది మహిళలపై పాక్ సైనికులు అత్యాచారాలు, దారుణాలకు పాల్పడ్డారని పేర్కొంది. సొంత ప్రజలపైనే బాంబులు వేస్తున్న దేశం అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందని భారత్ ఘాటుగా వ్యాఖ్యానించింది.

Advertisement